దాదాపు రెండు సంవత్సరాల తర్వాత ‘బాహుబలి’ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత ప్రభాస్ నటించిన ‘సాహో’ సినిమా ఆగస్టు 30న విడుదలకానుంది. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాపై ఇండియన్ ఫిలిం ప్రేక్షకులు చాలా అంచనాలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో మరో వారం రోజుల్లో విడుదల కాబోతున్న ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు చాలా సరదాగా సాగుతున్నాయి. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుక రామోజీ ఫిలిం సిటీలో అంగరంగ వైభవంగా జరిగింది.


మరోపక్క సినిమ ఇప్పటికే సెన్సార్ కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. అయితే ఈ సినిమాకి సంబంధించి తాజాగా మరో ఆసక్తికర వార్త బయటపడింది. సాహో సినిమా రిలీజ్‌కి ముందే ప్రభాస్ నటించిన బాహుబలి సినిమా రికార్డ్స్‌ను బ్రేక్ చేసింది. అప్పట్లో బాహుబలి 2 సినిమా తమిళనాడులో మొత్తం 525 థియేటర్లలో విడుదలయ్యింది. అయితే సాహోపై అంచనాలు పెరిగిపోతుండడం, బాహుబలితో తమిళనాట కూడా ప్రభాస్ క్రేజ్ పెరిగిపోవడంతో ‘సాహో’ సినిమాను తమిళనాడులో మొత్తం 550 థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నారట.


దీంతో సినిమా రిలీజ్ అవ్వకముందే బాహుబలి రికార్డులను సాహో ఈ విధంగా పగలగొడుతుంది అంటే...ఖచ్చితంగా సినిమా హిట్ అయితే మాత్రం బాహుబలి కలెక్షన్స్ కూడా అధిగమిస్తుందని అంటున్నారు ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందినవారు. ముఖ్యంగా బాహుబలి వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత అదే స్థాయిలో హిట్ కొట్టాలని ప్రభాస్ యాక్షన్ ఎపిసోడ్ ఉన్న ఈ సాహో స్టోరీని సెలక్ట్ చేసుకున్నాడట. సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ హాలీవుడ్ స్థాయిలో చిత్రీకరించారట సినిమా యూనిట్. ఏది ఏమైనా విడుదల కాకముందే సాహో ఇన్ని సంచలనాలు సృష్టిస్తున్ననేపథ్యంలో సినిమాపై చాలా అంచనాలు పెట్టుకున్నారు ప్రభాస్ అభిమానులు. 



మరింత సమాచారం తెలుసుకోండి: