పవన్ కళ్యాణ్ తన పై వచ్చే నెగిటివ్ వార్తలకు పెద్దగా స్పందించడు. అయితే ఒకసారి పవన్ స్పందించడం మొదలు పెడితే ఆ తిరుగుబాటు ఏస్థాయిలో ఉంటుందో తెలియచేసే ఆసక్తికర సంఘటన నిన్న జరిగింది. 

గత కొద్ది రోజులుగా పవన్ హైదరాబాద్ లో 130 కోట్ల విలువచేసే ఇల్లు కొనుక్కున్నాడని వచ్చేనెల రాబోతున్న పవన్ పుట్టినరోజు సందర్భంగా ఖరీదైన గిఫ్ట్స్ రూపంలో కొందరు పవన్ పేరును ఉపయోగించుకుని బ్లాక్ మనీని వైట్ గా మార్చబోతున్నారు అంటూ జరుగుతున్న నెగిటివ్ ప్రచారం పై పవన్ తన తీవ్ర అసహనాన్ని వ్యక్త పరచడమే కాకుండా ఈ వార్తలను ప్రచారం లోకి తీసుకు వస్తున్న వారిని శిక్షించమని తన ‘జనసేన’ తరఫున హైదరాబాద్ సైబర్ క్రైమ్ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం పవన్ పై జరుగుతున్న ఈ నెగిటివ్ ప్రచారం వెనుక కొన్ని రాజకీయ శక్తులు ఉన్నాయని జనసేన వర్గాలు తమ ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది.

దీనితో ప్రస్తుతం పవన్ పై జరుగుతున్న నెగిటివ్ ప్రచారం కొంతవరకు ఆగే ఆస్కారం కనిపిస్తోంది. ఇది ఇలా ఉండగా వచ్చేనెల 2వ తారీఖున జరగబోతున్న పవన్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా సోషల్ మీడియా అదిరిపోయే విధంగా పవన్ అభిమానులు పవన్ కు శుభాకాంక్షలు తెలుపుతూ లక్షల సంఖ్యలో ట్విట్స్ చేయాలని సంకల్పిస్తున్నట్లు తెలుస్తోంది. 

అదేవిధంగా పవన్ కళ్యాణ్ ‘జనసేన’ ఆశయాలను ప్రచారం చేస్తూ రకరకాల స్లొగన్స్ క్రియేట్ చేసి ఓటమితో జనసైనికులు వెనుతిరిగిపోలేదు అన్న సంకేతాలు ఇవ్వబోతున్నట్లు టాక్. ఓటమి ఎదురైనా తాను జీవితాంతం రాజకీయాలలోనే ఉంటాను అని పవన్ క్లారిటీ ఇచ్చిన నేపధ్యంలో పవర్ స్టార్ వెంట తామంతా ఉన్నామని తెలిపే విధంగా పవన్ అభిమానులు రాబోతున్న పవన్ పుట్టినరోజును చాల వ్యూహాత్మకంగా మలుచుకోబోతున్నారని టాక్.. 


మరింత సమాచారం తెలుసుకోండి: