స్టార్ డైరెక్టర్-స్టార్ హీరో కాంబినేషన్ లో సినిమా తీస్తే..అందులో ఛాన్స్ వచ్చిందంటే అంత అదృష్టం ఎవరికి ఉంటుంది.  అలాంటి మూవీలో ఒక్క చిన్న పాత్ర దొరికినా జన్మధన్యం అనుకునే నటులు ఉంటారు. అలాంటిది ఒకప్పుటు దేశం మొత్తం ఊపేసిన సినిమా, ప్రస్తుతం దాని సీక్వెల్ వస్తుంది. కానీ అంత గొప్ప సినిమా నుంచి ఓ హిరోయిర్ చికాకు పుట్టి తప్పుకున్నట్లో సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.



అసలు విషయానికి వస్తే.. నిన్న రిలీజ్ అయిన ‘కౌస్యలా కృష్ణమూర్తి’ సినిమాలో హీరోయిన్ గా నటించిన ఐశ్వర్య రాజేష్ కి కోలీవుడ్ లో మంచి పేరు ఉంది.  విభిన్నమైన కథాంశాలతో ఐశ్వర్య రాజేష్ పలు సినిమాల్లో నటించించి మంచి పేరు తెచ్చుకుంది. ఈ నేపథ్యంలోనే తమిళ్ లో సూపర్ హిట్ అయిన మూవీ తెలుగు లో కౌసల్య కృష్ణమూర్తి సినిమా గా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 


తాజాగా ఈ హీరోయిన్ స్టార్ డైరెక్టర్ శంకర్, విశ్వనటుడు కమల్ హాసన్ కాంబినేషన్ లో రూపొందుతున్న ‘భారతీయుడు 2’ సినిమా నుంచి తప్పుకున్నట్లో సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ మూవీలో కమల్ సరసన కాజల్ నటిస్తుంది. అయితే ఇందులో ఓ కీలక పాత్రలో  ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నట్లు ఆ మద్య వార్తలు వచ్చాయి.  గత కొంత కాలంగా ఆమె సినిమాను నుంచి తప్పుకునే ఆలోచనలో ఉన్నట్లు రూమర్స్ వచ్చాయి.

ఫైనల్ గా ఆ రూమర్సే ఇప్పుడు నిజమని తేలిపోయింది. ఈ మూవీ మొదలైనప్పటి నుంచి ఎన్నో అవాంతరాలు వస్తూనే ఉన్నాయి. ఈ మద్య ఓ ఇంటర్వ్యూలో ఐశ్వర్యా రాజేష్ సంచలన విషయం తెలిపింది. ఈ మూవీ మొదలైనప్పటి నుంచి ఆగిపోతుండడంతో డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోతున్నానని ప్రస్తుతం రెస్ట్ లేకుండా బిజీ షెడ్యూల్ లో ఉన్నట్లు చెబుతూ సినిమాకు ఎప్పుడు పడితే అప్పుడు డేట్స్ సమకూర్చలేనని కుండబద్దలు కొట్టేసింది


మరింత సమాచారం తెలుసుకోండి: