ప్రభాస్ ఇండియాస్ మోస్ట్ వాటెండ్ హీరో.. క్రేజీ స్టార్.. అంతకు మించి ఇంకేమైనా ఉంటె అవన్నీ ప్రభాస్ ఖాతాలోకి వెళ్తాయి.  బాహుబలికి ముందు ప్రభాస్వేరు.. బాహుబలి తరువాత చూస్తున్న ప్రభాస్ వేరు.  అప్పట్లో ప్రభాస్ సినిమాలు తెలుగు రాష్ట్రాలకే పరిమితం.  కానీ, ఇప్పుడు ఈ హీరో ఇండియన్ స్టార్ నటుడు.  బాహుబలి సినిమా బాలీవుడ్ లో ఏ స్థాయిలో మెప్పించిందో చెప్పక్కర్లేదు.  భారీ హిట్ కొట్టింది. బాహుబలి సినిమాకు పంజాబ్ లోను అదే స్థాయిలో ఫ్యాన్స్ ఉన్నారు.  


ఉన్నట్టుగానే సినిమా మంచి విజయం సాధించింది.  ఇది ప్రభాస్ ఫ్యాన్స్ కు చెప్పలేనంత గౌరవం దక్కింది.  బాహుబలి తరువాత చేస్తున్న సాహో విషయంలోనూ అదే క్రేజ్ వచ్చింది.  పంజాబ్ లో హిందీ సినిమాలు, పంజాబీ సినిమాలు ఎక్కువగా ఆడుతుంటాయి.  ఇప్పుడు ప్రభాస్ సాహో కోసం అక్కడి థియేటర్లను రెడీ చేస్తున్నారు.  కొత్త స్క్రీన్స్ ఏర్పాటు చేస్తున్నారట.  ఇండియన్ స్క్రీన్ పై ఇప్పటి వరకు చూడని విధంగా ఫైట్స్ ను సినిమాలో ఉన్నాయి కాబట్టి, వాటిని చూడాలంటె బిగ్ స్క్రీన్స్ కావాలని మార్చేస్తున్నారు. 

బాహుబలి పంజాబ్ లో హిట్ కొట్టిన తరువాత రిలీజ్ కాబోతున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా పెరిగాయి.  తప్పకుండా ఈ సినిమాతో పంజాబీ స్టార్ అయిపోతాడని పంజాబ్ డిస్ట్రిబ్యూటర్స్ అంటున్నారు.  చూస్తుంటే అలానే ఉన్నది.  ఇకపై కేవలం సౌత్, ముంబై లోనే కాకుండా ప్రభాస్ ఢిల్లీ, పంజాబ్ లో కూడా ప్రెస్ మీట్ పెట్టాల్సి రావొచ్చు.  అలా చేస్తేనే అక్కడ కూడా స్టార్ ఇమేజ్ తెచ్చుకోవచ్చు.  


సౌత్ స్టార్ కు ఈ రేంజ్ లో క్రేజ్ వస్తుందని అస్సలు ఊహించలేదు. ఊహించని విధంగా వచ్చేదే క్రేజ్ అంటే.  ప్రభాస్ నెక్స్ట్ ఓ లవ్ స్టోరీ సినిమా చేస్తున్నాడు.  అది కూడా పెరియాడికల్ లవ్ స్టోరీ.  రాధాకృష్ణ దర్శకత్వంలో వస్తున్నది.  దాన్ని కూడా యూవీ క్రియేషన్స్, గోపికృష్ణా మూవీస్ నిర్మిస్తున్నాయి.  ఇది కూడా భారీ సినిమానే.  దాదాపు 150 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేస్తున్నారని సమాచారం.  సాహో హిట్టయితే దానికి డిమాండ్ పెరుగుతుంది.  సో, సాహో తరహాలోనే దాన్ని కూడా పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేస్తారనడంలో సందేహం ఉండదు.  ఈ లెక్కన తీసుకుంటే ప్రభాస్ సంవత్సరానికి రెండు కాదు.. కనీసం ఒక్కటి కూడా చేయలేడు అన్నది గ్యారెంటీనే.  


మరింత సమాచారం తెలుసుకోండి: