సౌత్ ఇండస్ట్రీ లో ఓవర్సీస్ లో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రం గా రెబల్ స్టార్  ప్రభాస్ నటించిన  యాక్షన్ ఎంటర్ టైనర్ సాహో బెంచ్ మార్క్ ను సెట్ చేసింది.  ఫార్ ఫిలిమ్స్ ఈ చిత్రం యొక్క ఓవర్సీస్ హక్కులను  42కోట్లకు సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న దర్బార్  కూడా  అదే బాటలో పయనిస్తుంది. ఈ సినిమా అన్ని భాషల ఓవర్సీస్ హక్కులను  కూడా ఫార్ ఫిలిమ్స్సే  సొంతం చేసుకుంది. ఈ హక్కుల విలువ 38కోట్లని సమాచారం. దాంతో ఓవర్సీస్ లో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన కోలీవుడ్ సినిమాగా రికార్డు సృష్టించింది దర్బార్.  మరి  ఈ రెండు సినిమాలు  యుఎస్ ప్రేక్షకులను మెప్పించి ఆ మొత్తాన్ని వెనక్కు తెస్తే ఓకే కానీ అనూహ్యంగా  బాక్సాఫీస్ వద్ద బోల్తా పడితే మాత్రం  బయ్యర్లు భారీ గా నష్టపోనున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో.. 





ఇక సాహో  ఈ నెల 30 న ప్రపంచ  వ్యాప్తంగా  భారీ స్థాయిలో విడుదలకు   సిద్ధమవ్వగా  దర్బార్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.  స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురగదాస్  తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో  లేడీ సూపర్ స్టార్  నయనతార  హీరోయిన్ గా నటిస్తుండగా యంగ్ హీరోయిన్  నివేతా థామస్  ముఖ్య పాత్రలో కనిపించనుంది.  యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రజినీ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. రజినీ -మురగదాస్ కాంబినేషన్ లో  వస్తున్న మొదటి సినిమా కావడం తో దర్బార్  ఫై తమిళ్ తో పాటు తెలుగులోనూ భారీ అంచనాలు వున్నాయి. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం  వచ్చే ఏడాది  సంక్రాంతికి  విడుదలకానుంది.    

మరింత సమాచారం తెలుసుకోండి: