డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన బాహుబలి సినిమా ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా అదిరిపోయే హిట్ అందుకుంది. ఈ సినిమాతో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ దమ్మెంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా దర్శకులకు అర్థమైంది. సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో సినిమాకి వచ్చిన టాక్ విని భారత్ ప్రధాని మోడీ కూడా సినిమా యూనిట్ నీ తన దగ్గరకు పిలిచి కొని అభినందనలు చెప్పడం జరిగింది. ఇంతగా సినిమాకి మంచి పేరు రావడం మరోపక్క ప్రభాస్ కి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావటం పట్ల ఇటీవల సాహో సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో బాహుబలి గురించి షాకింగ్ కామెంట్ చేశాడు ప్రభాస్.


బాహుబలి సినిమా ఎంత పేరు తీసుకు వచ్చిందో అదేవిధంగా చాలా ఇబ్బందులు కూడా తీసుకు వచ్చినట్లు పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల అయ్యి మంచి గుర్తింపు వచ్చిన క్రమంలో ఎక్కడైనా ఏదైనా దేశానికి వెళ్లిన ప్రైవసీ ఉండేది కాదని...తననే గుర్తుపట్టేవారు అని దీంతో బాహుబలి సినిమాతో స్వేచ్ఛ కోల్పోయాను అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ చెప్పుకొచ్చారు.


అంతేకాకుండా బాహుబలి సినిమా వల్ల మానసిక ఒత్తిడి పెరిగి పోయిందని...అంతటి భారీ విజయం వచ్చిన తర్వాత ప్రస్తుతం చేసిన సాహో సినిమా నీ ప్రేక్షకులు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారో అన్న టెన్షన్ చాలా ఉందని కానీ డైరెక్టర్ సుజిత్ అద్భుతంగా హ్యాండిల్ చేశాడని...ప్రభాస్ మాట్లాడుతూ..‘గుజరాత్‌లోని పిల్లలు ‘బాహుబలి’ పాటలు పాడుతున్నారని నా ప్రెండ్ చెప్పాడు. ఏ  ఏరియావాళ్లు నన్ను ఇష్టపడుతున్నారో కూడా తెలియడం లేదు. కాబట్టి చాలా టెన్షన్ గా, ఒత్తిడిగా ఉంది. కొన్ని సార్లు భయమేస్తోంది. ‘సాహో’ వల్ల ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపా, గడుపుతున్నా. దీని వల్ల చాలా రోజులు కంటిమీద కునుకు లేదు’ అన్నారు. మరి కొద్ది రోజులలో విడుదల కాబోతున్న సాహో సినిమాపై దేశవ్యాప్తంగా చాలా అంచనాలు ఉన్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: