టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ నిర్మాణ సంస్థ, అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సినిమా సైరా నరసింహారెడ్డి. మెగాస్టార్ సరసన నయనతార జోడి కడుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ఇటీవల యూట్యూబ్ లో రిలీజ్ అయి పెద్ద సంచనాలన్ని సృష్టించి, సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలను బాగా పెంచేసింది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2న ప్రేక్షకుల  ముందుకు తీసుకురానున్నారు. ఇక ఈ సినిమాకు సంబంచి అప్పుడే ప్రమోషనల్ కార్యక్రమాలు మొదలెట్టారు సినిమా యూనిట్. అందులో భాగంగా ఇటీవల టీజర్ రిలీజ్ ని ముంబైలో గ్రాండ్ గా జరుపడం జరిగింది. 

తెలుగు, హిందీ సహా పలు ఇతర భాషల్లో రిలీజ్ అవుతున్న సైరా పై ఆయా భాషల్లో కూడా మంచి అంచనాలున్నాయి. ఇకపోతే ఈ సినిమాను ఎలాగైనా విజయవంతం చేయాలనే గట్టిపట్టుదలతో ఉన్నారట నిర్మాత రామ్ చరణ్. ఈమేరకు అతి త్వరలో మిగతా భాషల్లో కూడా సినిమాను బాగా ప్రమోట్ చేసే విధంగా అన్ని ప్రణాళికలు సిద్ధం చేశారట. దాదాపుగా రూ.250 కోట్ల భారీ బడ్జెట్ రూపొందుతున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు, రవి కిషన్ వంటి దిగ్గజ నటులు నటిస్తుండడంతో ఈ సినిమాకు పాన్ ఇండియా అపీల్ రావడం జరిగింది. ముందుగా ఈ సినిమాకు సంబంధించి అతిత్వరలో ఒక్కొక్కటిగా సాంగ్స్ ని యూట్యూబ్ లో విడుదల చేయడం జరుగుతుందని, 

అలానే ఆ తరువాత అతిరథ మహారథులైన సినీ ప్రముఖుల సమక్షంలో ఈ సినిమా ప్రి రిలీజ్ వేడుకను ఎంతో వైభవంగా జరపాలని కూడా నిర్ణయించినట్లు సమాచారం. మెగాస్టార్ తో పాటు సినిమాలోని ముఖ్య పాత్రధారులు కూడా రాబోయే రోజుల్లో సినిమా ప్రమోషన్స్ లో భాగం అవుతారని, యూనిట్ మొత్తం ఎంతో కష్టించి తెరకెక్కించిన ఈ సైరా తప్పకుండా మంచి సక్సెస్ సాదిస్తుందని, నిర్మాత చరణ్ ఎంతో నమ్మకంగా ఉన్నారట. బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది సంగీతాన్ని, రత్నవేలు కెమెరాని అందిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ తమన్నా మరియు నిహారిక కొణిదెల ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్నారు....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: