బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ 'క్వీన్' ఇప్పుడు సౌత్ లో నాలుగు భాషల్లో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అన్నివెర్షన్ ల షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ అయ్యి విడుదలకు ఎదురుచూస్తున్నాయి. ఇక ఈ చిత్రం తమిళంలో 'పారిస్ పారిస్' అనే టైటిల్ తో రీమేక్ అవుతుంది. కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటించగా రమేష్ అరవింద్ దర్శకత్వం వహించాడు. ఇటీవల ఈ సినిమా టీజర్ ను విడుదల చేయగా అందులో కాజల్ , బాలీవుడ్ నటి ఇల్లి అవరం మధ్య వచ్చే సన్నివేశం
వివాదాస్పదం అయ్యింది.
ఇక ఈ సినిమా రీసెంట్ గా సెన్సార్ కు పంపించగా సెన్సార్ బోర్డు ఆ సన్నివేశం తో పాటు ఏకంగా 25 కట్లు చెప్పి సినిమా కు యు/ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. దాంతో షాక్ తిన్న నిర్మాతలు రివైసింగ్ కమిటీ ని ఆశ్రయించగా అక్కడ కూడా నిరాశే ఎదురైయ్యింది. ఒకవేళ ఆసీన్ ను ఉంచాలనుకుంటే మాత్రం సినిమాకు ఏ సర్టిఫికేట్ ఇస్తామని కమిటీ తేల్చి చెప్పడంతో చేసేదేం లేక ఆ సన్నివేశాన్ని తొలిగించారు. దాంతో ఈసినిమా యు / ఏ సర్టిఫికేట్ తో విడుదలకానుంది. ఇక ఇటీవల ఆ సన్నివేశాలను సినిమాలో ఉంచండి ఎవరిని కించపరచడానికి చేసినవి కాదు అని కాజల్ మొరపెట్టుకున్నా సెన్సార్ బోర్డు వినిపించుకోలేదు.
ఇక క్వీన్ తెలుగులో 'దటీజ్ మహాలక్ష్మీ' కన్నడలో 'బట్టర్ ఫ్లై' అలాగే మళయాలంలో 'జాం జాం' అనే టైటిళ్ల తో రీమేక్ అవుతుంది. కాగా దటీజ్ మహాలక్ష్మీ లో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటించగా 'అవె' ఫేమ్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించాడు. అప్పుడెప్పుడో ఈసినిమా కు సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు మళ్ళీ ఇంతవరకు ఈ సినిమా గురించి ఎటువంటి అప్ డేట్ ఇవ్వలేదు. మరి ఈ చిత్రం ఎప్పుడు విడుదలవుతుందో చూడాలి.