‘సాహో’ ప్రమోషన్ కోసం ఒక్క క్షణం తీరిక లేకుండా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రభాస్ తన సొంత ధియేటర్ ప్రారంభోత్సవానికి కూడ దూరంగా ఉంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం మల్టీ ప్లెక్స్ ధియేటర్ల బిజినెస్ అత్యంత లాభదాయకంగా ఉండటంతో ప్రభాస్ తన యూవీ క్రియేషన్స్ నిర్మాతల భాగస్వామ్యంతో నెల్లూరి జిల్లాలోని సూళ్ళూరి పేటలో ‘వి ఎపిక్’ మల్టీ ప్లెక్స్ ధియేటర్ ను నిర్మించాడు. 

భారతదేశంలోనే అత్యంత పెద్దది అయిన స్క్రీన్ తో నిర్మింపబడ్డ ఈ ధియేటర్ అత్యాధునిక సౌకర్యాలతో విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించారు. ఈ ధియేటర్ లో సినిమాను చూసే ప్రేక్షకులకు సౌండ్ సిస్టమ్ లోనే కాకుండా సీటింగ్ విషయంలో కూడ అత్యాధునిక పోకడలతో ఈమూవీ ధియేటర్ ను నిర్మించినట్లు వార్తలు వస్తున్నాయి. 

ఈ ధియేటర్ ను ఈనెల 30వ తారీఖున విడుదలకాబోతున్న ‘సాహో’ మూవీతో ప్రారంభిస్తున్నారు. వాస్తవానికి ఈ ధియేటర్ ప్రారంభోత్సవానికి ప్రభాస్ తో పాటు చరణ్ జూనియర్ లను అతిధులుగా పిలిచారు. అయితే ప్రభాస్ ఈ నెల 30వ తారీఖున ‘సాహో’ ను ప్రమోట్ చేస్తూ లండన్ లో ఉండబోతున్న నేపధ్యంలో ఈమూవీ ధియేటర్ ప్రారంభోత్సవాన్ని చాల సాదాగా నిర్వహిస్తున్నారు. 

అయితే ఈ ధియేటర్ ప్రారంభోత్సవానికి ప్రభాస్ పెద్దనాన్న కృష్ణంరాజుతో పాటు ఈ మూవీ దర్శకుడు సుజిత్ ముఖ్య అతిధులుగా రాబోతున్నారు. తెలుస్తున్న సమాచారం మేరకు ఇలాంటి ఎపిక్ ధియేటర్లను ప్రభాస్ విజయవాడ గుంటూరు విశాఖపట్నం ప్రాంతాలలో కూడ నిర్మించి ధియేటర్ల విషయంలో కూడ తన పట్టును కొనసాగించబోతున్నట్లు టాక్. టాప్ యంగ్ హీరోలు అంతా రకరకాల వ్యాపారాలు చేస్తున్న పరిస్థితులలో ప్రభాస్ ఇలా ధియేటర్ల నిర్మాణం వైపు అడుగువేయడమే కాకుండా రానున్న రోజులలో ఈ ‘వి ఎపిక్’ ధియేటర్స్ చైన్ ను హైదరాబాద్ లో కూడ విస్తరించాలని ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది..    


మరింత సమాచారం తెలుసుకోండి: