స్టార్ డైరెక్టర్  త్రివిక్రమ్ -  స్టైలిష్ స్టార్ అల్లు  అర్జున్ కాంబినేషన్ లో వస్తోన్న   'అల వైకుంఠపురములో'  సినిమాకి కొత్త రైటర్ జాయిన్ అయ్యాడు. త్రివిక్రమ్ కి కామెడీ డైలాగ్ లు రాయడంలో హైపర్ ఆది హెల్ప్ చేస్తున్నాడు. అయితే కేవలం ఒక క్యారెక్టర్ కి మాత్రమే హైపర్ ఆది డైలాగ్స్ రాస్తున్నాడు. ఆ క్యారెక్టర్ ను కూడా హైపర్ ఆదినే చేస్తున్నాడు. ఈ విషయాన్ని త్రివిక్రమే సెట్ లో మిగిలిన ఆర్టిస్ట్ లకు ఈ రోజు చెప్పాడని చిత్రయూనిట్ లోని ఓ సభ్యుడు చెప్పుకొచ్చాడు.  ఇక ఇప్పటికే 'జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి' చిత్రాలతో హిట్ అందుకున్న త్రివిక్రమ్ - బన్నీ,   ఇప్పుడు ముచ్చటగా మూడోసారి పర్ ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో    రాబోతున్నారు. ఈ సినిమలో బన్నీ సరసన  పూజా హెగ్డే  హీరోయిన్ గా నటిస్తోంది.  అలాగే ఈ సినిమాలో  సుశాంత్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు.  ఒకప్పటి హాట్ హీరోయిన్ టబు కూడా  కీలక పాత్రలో  నటిస్తోంది.  తమన్ సంగీతం అందిస్తోన్న  ఈ సినిమాను గీతా ఆర్ట్స్ మరియు  హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా  నిర్మిస్తున్నారు.  ఈ  సినిమాలో  త్రివిక్రమ్ కామెడీ  హైలెట్ అయ్యేలా ప్లాన్ చేశాడట.  ముఖ్యంగా వెన్నల కిషోర్ కోసం  అద్భుతమైన పాత్రను రాశాడట.   సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం బన్నీకి - కిషోర్ కి మధ్య వచ్చే సన్నివేశాలు చాలా బాగా నవ్విస్తాయని..  అలాగే  సెకెండాఫ్ లో ప్రీ క్లైమాక్స్ లో వచ్చే  సీక్వెన్స్ లో కూడా  కిషోర్  పగలబడి నవ్వేలా కామెడీ చేస్తాడట.   


దీనికితోడు  సినిమాలో అల్లు  అర్జున్ ను  త్రివిక్రమ్ కాస్త వైవిధ్యంగా  చూపించబోతున్నాడని సమాచారం.  బన్నీ డ్రెసింగ్ స్టైల్ దగ్గర నుంచి  హెయిర్ స్టైల్ వరకూ ఈ సినిమాలో కొత్త బన్నీ కనిపించేలా త్రివిక్రమ్ జాగ్రత్తలు  తీసుకుంటున్నాడు. ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ అందిస్తోన్న సంగతి తెలిసిందే.  కాగా తమన్  ఈ సినిమా కోసం ఇప్పటికే ట్యూన్స్ అన్ని ఇచ్చేశాడట.  బన్నీ డాన్స్ మూమెంట్స్ కి తగట్లు ట్యూన్స్ అద్భుతంగా వచ్చాయని.. ముఖ్యంగా మాస్ ఆడియన్స్ కి మంచి కిక్ ఇచ్చేలా సినిమాలో  ఓ మాస్ సాంగ్ ఉండబోతుందని  తెలుస్తోంది. వచ్చే షెడ్యూల్ లో ఈ  మాస్ సాంగ్ ను షూట్ చేయబోతున్నారు.  మొత్తానికి ఈ సినిమా ఆల్బమ్  తమన్ కెరీర్ లోనే  మరో సూపర్ హిట్ ఆల్బమ్ గా నిలిచిపోతుందట.    


మరింత సమాచారం తెలుసుకోండి: