టాలీవుడ్ లో ప్రస్తుతం మెగాస్టార్, బాలయ్యబాబు, నాగార్జున, వెంకటేష్ లాంటి సీనియర్ హీరోలకు కూడా హీరోయిన్లు దొరుకుతున్నారు గాని, యంగ్ హీరో అఖిల్ బాబుకు మాత్రం హీరోయిన్ దొరకట్లేదు. బొమ్మరిల్లు భాస్కర్ తో అఖిల్ చేయబోతున్న సినిమాలో హీరోయిన్ కోసం దాదాపు సంవత్సరం నుండి అఖిల్ బాబు హీరోయిన్లును చూస్తూనే ఉన్నాడు. కానీ ఇంకా హీరోయిన్ మాత్రం ఫైనల్ కాలేదు. ఆ మధ్య కియరా అద్వానీ లేదా రష్మికా మండన్నలో ఎవరో ఒకర్ని హీరోయిన్ గా తీసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ వాటిల్లో నిజం లేదని తేలిపోయింది. ఇక అఖిల్ సరసన దాదాపు కొత్త హీరోయిన్ నే ఫైనల్ చేసేలా ఉన్నారు. మొదట కొంతమంది స్టార్ హీరోయిన్ల పేర్లను పరిశీలించినా చివరికీ కొత్త అమ్మాయి వైపే మొగ్గు చూపారట దర్శక నిర్మాతలు. కాకపోతే ఆ కొత్త హీరోయిన్ అఖిల్ బాబుకు నచ్చలేదు. ఇక దాదాపు రష్మికా మండన్న వైపు మొగ్గు చూపారు. అఖిల్ కూడా ఓకే అన్నాడు, కానీ రష్మిక డేట్లు ఖాళీగా లేవట. దాంతో అఖిల్ కి హీరోయిన్ సమస్య మళ్లీ మొదటికే వచ్చింది. ఇక 'గ్యాంగ్ లీడర్'లో నటిస్తోన్న ప్రియాంక అరుల్ మోహన్ ను అఖిల్ సినిమాలో హీరోయిన్ గా తీసుకోనున్నారని వార్తలు వస్తున్నాయి. కానీ అది నిజం కాదట. చిత్రబృందం ఇంకా ఏ హీరోయిన్ ను ఫైనల్ చేయలేదట. వచ్చే నెల మొదటి వారంలో చేయబోయే షెడ్యూల్ లో హీరోయిన్ ను ఫైనల్ చేస్తారట. ఈ షెడ్యూల్ లో హీరోయిన్ తో కూడా షూట్ చేస్తారట.
ఇక 'మిస్టర్ మజ్ను' కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది అక్కినేని అఖిల్ కి. దాంతో తన తరువాత సినిమా పై మరింత జాగ్రత్త పడుతున్నాడు అఖిల్. ఈ సినిమా కూడా బొమ్మరిల్లు భాస్కర్ సినిమాలో లాగానే బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు లవ్ స్టోరీ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోందట. ఇక ఈ సినిమాను గీతా ఆర్ట్స్ నే నిర్మిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్నారు. మరి భాస్కర్ తో చెయ్యబోయే సినిమాతోనైనా అఖిల్ భారీ విజయాన్ని అందుకుంటాడేమో చూడాలి.