స్టార్ హోటల్స్ లో భోజనం అనగానే హ్యాపీగా ఆలోచించకుండా తినేస్తుంటారు. వడ్డించే సమయంలో నీట్ గా ఉండటం.. హై టెక్ హంగులు కనిపించడం వంటి వాటితో వావ్ అనిపిస్తుంది. రకరకాల రుచులు ... అంతకు మించి హైటెక్ రుచులు.. రకరకాల వ్యక్తులు.. మధ్యతరగతి ప్రజలు అడుగుపెట్టలేని విధంగా ఉండే సువాసనలు.. ఇంకేముంది.. హోటల్ సిబ్బంది ఏం వడ్డించినా సరే తినేస్తుంటారు. అయితే, ఇటీవలే హీరోయిన్ మీరా చోప్రా గుజరాత్ లోని అహ్మదాబాద్లోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ కు వెళ్ళింది.
వెళ్ళినపుడు అంతా బాగానే ఉన్నది. ఆ తరువాతే ఆమెకు అసలు అసలు సంగతి బయటపడింది. హోటల్ లో వారం రోజల నుంచి ఉంటోంది. వారం రోజుల్లో రోజు అక్కడి ఆహరం తీసుకోవడం వలన సిక్ అయ్యింది. ఎందుకో ఏంటో తెలియదు. కానీ అనారోగ్యం పాలైంది. ఇదిలా ఉంటె, రీసెంట్ గా హోటల్ రెస్టారెంట్ కు వెళ్లి టిఫిన్ ఆర్డర్ చేసింది.
వచ్చిన ఆర్డర్ చూసి షాక్ అయ్యింది. ప్లేస్ నీటుగా ఉన్నాయి. తిందామని తీసుకున్న ఆహారాన్ని టచ్ చేయగానే అందులో నుంచి కొన్ని తెల్లని పురుగులు బయటకు వచ్చాయి. వాటిని హీరోయిన్ మీరా చోప్రా షాక్ అయ్యింది. ఆ ప్లేట్ లో తిరుగుతున్న తెల్లని పురుగులను వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వారం రోజుల క్రితం ఆ హోటల్ కు వచ్చానని, వచ్చినపుడు బాగానే ఉన్నానని చెప్పింది.
వారం నుంచి తన శరీరంలో మార్పులు వచ్చాయని.. సడెన్ గా అనారోగ్యం పాలైనట్టు అనిపించిందని చెప్పింది. ఎందుకు ఇలా జరిగిందో తెలియదని, కానీ, టిఫిన్ లో ఇలా పురుగులు రావడం చూస్తుంటే.. దీనివలన అనారోగ్యం పాలయ్యినట్టు అర్ధం అవుతున్నట్టు తెలుస్తోందని అంటోంది మీరా చోప్రా. హోటల్ కు వెళ్లిన తరువాత అక్కడ ఎలాంటి భోజనం ఇస్తున్నారో తప్పకుండా తెలుసుకోవాలని అంటోంది మీరా చోప్రా.