ప్రస్తుతం ప్రభాస్ సాహు మూవీ ప్రమోషన్ బిజీలో ఉన్నాడు.  మరో వేరే ఏ విషయం గురించి పెద్దగా పట్టించుకోవడంలేదు.  దానికి చాలా కారణాలు ఉన్నాయి.  సాహో సినిమా సొంత మూవీ.  తన ఫ్రెండ్స్ కలిసి నిర్మిస్తున్న సినిమా.  నిర్మాతలకు ఎంతటి బాధ్యత ఉన్నదో ప్రభాస్ కు కూడా అంతే బాధ్యత ఉన్నది.  ఇంకా చెప్పాలి అంటే.. అంతకంటే ఎక్కువ బాధ్యత ఉన్నది.  


దేశంలోని ప్రముఖ నగరాల్లో సినిమాను ప్రమోషన్ చేసుకుంటున్నారు.  కారణం ఏంటి.. అంటే.. సినిమాకు క్రేజ్ రావడమే.  దక్షిణ భారత దేశంలోని అనేక నగరాల్లో ప్రమోషన్ చేసుకుంటున్నారు.  అలానే నార్త్ ఇండియాలోని అనేక నగరాల్లో కూడా ఈ మూవీని ప్రమోషన్ చేస్తున్నారు.  ఇలా అన్ని నగరాల్లో ప్రమోషన్ చేయడం వలన సినిమాకు ప్లస్ అవుతుంది.  


ఇదిలా ఉంటె, ఈనెల 30 వ తేదీన నెల్లూరు జిల్లా సూళ్లూరు పేటలో వి ఎపిక్ మల్టీ ప్లెక్స్ ఓపెన్ కావాల్సి ఉన్నది.  ఆరోజున సాహో రిలీజ్ అవుతున్నది.  వి మల్టీప్లెక్స్ థియేటర్స్ ను ప్రభాస్ తన స్నేహితులైన యూవీ క్రియేషన్స్ కలిసి ఏర్పాటు చేశాయి. సాహో మూవీతోనే ఈ థియేటర్స్ ఓపెన్ అవుతున్నాయి.  భారీ ఖర్చుతో నిర్మిస్తున్న ఈ వి ఎపిక్ మల్టిప్లెక్స్ ను సూళ్లూరు పేటలోని ఎందుకు నిర్మించాల్సి వచ్చింది అంటే.. అటు తమిళనాడుకు.. ఇటు ఆంధ్రాలోనూ బోర్డర్ కాబట్టి ఇద్దరికి అనుకూలంగా ఉంటుందని చెప్పి అక్కడ నిర్మించారు. 


అంతేకాదు, సూళ్లూరుపేట పర్యాటకంగా మంచి అభివృద్ధి చెందిన ప్రాంతం.  ఆర్థికంగా నెల్లూరు జిల్లాలో సూళ్లూరు పేట ఒక బలమైన ప్రాంతం అందుకే ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నారు.  సాహు సినిమా, థియేటర్ ఓపెనింగ్ కాబట్టి ఈ అకేషన్ కు టాలీవుడ్ నుంచి చాలా మంది ప్రముఖులు హాజరవుతారని తెలుస్తోంది.  అయితే, ఈ ఓపెనింగ్ కోసం ప్రభాస్ వస్తాడా రాడా అన్నది తెలియాల్సి ఉన్నది.  


మరింత సమాచారం తెలుసుకోండి: