తెలుగులో వస్తున్న బిగ్ బాస్ 3 రోజు రోజుకీ కాంట్రవర్సీగా మారుతుంది.  బిగ్ బాస్ సీజన్ 1 చివరి మూవ్ మెంట్ లో గొడవలు జరిగాయి. కానీ సెకండ్ సీజన్ మాత్రం దారుణంగా రెండో వారం నుంచే ఎన్నో గొవలు..ఒకదశలో మ్యాన్ హ్యాండిల్ వురకు వెళ్లింది..కానీ ఇంటి సభ్యల జోక్యంతో ఆగిపోయారు.  ఇలా సెకండ్ ఇన్నింగ్స్ బిగ్ బాస్ ఎన్నో కాంట్రవర్సీలు సృష్టించింది.  ప్రస్తుతం బిగ్ బాస్ మూడో సీజన్ నడుస్తుంది.  ఫస్ట్ సీజన్ ఎన్టీఆర్, సెకండ్ సీజన్ నాని..ఇప్పుడు అక్కినేని నాగార్జున.  సోమవారం నుంచి శుక్రవారం ఇంట్లో ఏం జరిగిందో శనివారం నాగ్ ప్రేక్షకులకు చూపించి వాటిపై వివరణ, సూచనలు ఇస్తుంటారు. 

ఇప్పటి వరకు ఐదు వారాలు ముగిశాయి..నటి హేమ, జాఫర్, తమన్నా, రోహిణి ఎలిమినేషన్ అయ్యారు.  నిన్న ఒకరి పై ఒకరు అభిప్రాయాలు వ్యక్తం చేయాల్సిందిగా నాగ్ చెప్పడంతో అందరి మనసులో విషయాలు బయటకు వచ్చాయి. శుక్రవారం నాటి  ఎపిసోడ్‌లో వితికా-పునర్నవిల మధ్య బిగ్ బాస్ గొడవ పెట్టడంతో ఇద్దరి మధ్య మాటలు లేకుండా పోయాయి. నేను ఏం తప్పు చేశా.. ఆమె ఎందుకు అలా ఫీల్ అవుతుందని వితికా బాధపడగా వరుణ్ ఓదార్చే ప్రయత్నం చేశారు. హౌస్‌లో కంటెస్టెంట్స్‌లో మీకు ఎవరు శత్రువు? ఎవరు మిత్రుడు? ఎవరు వెన్నుపోటుదారు? అనుకుంటున్నారని రాబట్టే ప్రయత్నం చేశారు. ఇక ఈవారం  ఎలిమినేషన్‌లో ఏడుగురు రాహుల్,హిమజ, అషు, మహేష్, పునర్నవి, శివజ్యోతి, బాబా భాస్కర్‌‌‌లు ఉండగా.. ఈ ఏడుగురిలో మహేశ్, శివజ్యోతి సేవ్ అయినట్లు తెలిపారు. 


  హౌస్ మేట్స్ ప్రవర్తన నచ్చక వారి తప్పులను ఎత్తిచూపారు నాగార్జున. ముందుగా అలీతో మాట్లాడుతూ గతవారం స్కిట్ లో తన పెర్ఫార్మన్స్ బాగుందని పొగిడారు. అగ్రెసివ్ గా ఉండే అలీకి చురకలు వేశారు నాగ్. ఆడపిల్ల కెప్టెన్ అయితే మాట వినవా? అంత అహంకారం ఎందుకు? హౌస్‌లో ఏదైనా జరుగుతుంటే హౌస్‌లో పెద్ద మనిషిగా ఉన్న బాబా భాస్కర్.. మీరు ఆపాలి కాదా? అని  ప్రశ్నించడంతో. దానికి సిల్లీగా రియాక్ట్ అయ్యారు బాబా భాస్కర్. దాంతో చిర్రెత్తుకొచ్చిన నాగార్జున ఇది కామెడీ షో కాదు..సీరియస్ గా మాట్లాడుతున్నా అనడంతో ఇంటి సభ్యులు సైలెంట్ అయ్యారు.  ఎప్పటిలానే ఈ వారం కూడా హౌస్ మేట్స్ తో గేమ్ ఆడించారు నాగార్జున. 



మరింత సమాచారం తెలుసుకోండి: