సల్మాన్ ఖాన్ బాలీవుడ్ లో టాప్ హీరో. అందులో సందేహం అవసరం లేదు. ఆయనతో కలిసి నటించాలని చాలామంది హీరోయిన్లు అనుకుంటారు. సల్మాన్ తో కలిసి నటిస్తే.. ఆ హీరోయిన్లకు మంచి పేరు వస్తుంది. సినిమా హిట్టయితే ఇక చెప్పాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా సల్మాన్ తో చేసిన హీరోయిన్ సినిమా ఇండస్ట్రీలో తప్పకుండా టాప్ పొజిషన్లో ఉంటుంది. మొదటి నుంచి ఇలానే జరుగుతున్నది.
అయితే, భారత్ సినిమాలో మొదట ప్రియాంక చోప్రాను హీరోయిన్ అనుకున్నారు. కానీ, ఆమె అర్ధాంతరంగా సినిమాను వదిలేసి వెళ్ళిపోయింది. సల్మాన్ తో కలిసి సినిమా చేయడం ఇష్టం లేకనో లేదంటే మరేదైనా కారణం ఉందేమో తెలియదుగాని సల్మాన్ సినిమాను మాత్రం పక్కన పెట్టింది. అప్పట్లో ఇది సంచలనంగా మారింది. కాగా భారత్ లో ప్రియాంకా ప్లేస్ లోకి కత్రినాను తీసుకున్నారు. సినిమా సూపర్ హిట్ అయ్యింది.
ఇక్కడ మరో విషయం గురించి మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఇండియాలో మోస్ట్ వాంటెడ్ సినిమాల్లో ఒకటి సాహో. ఈ మూవీ ఆగష్టు 30 వ తేదీన భారీ ఎత్తున రిలీజ్ కాబోతున్నది. బాలీవుడ్ లో సినిమాకు క్రేజ్ పెరిగింది. ఇప్పటికే సినిమా టికెట్స్ పూర్తయినట్టు సమాచారం. అంతేకాదు, సినిమాపై నమ్మకాలూ భారీగా ఉన్నాయి. సినిమా రిలీజ్ కు సమయం దగ్గర పడుతుండటంతో..హీరో, హీరోయిన్లు ప్రమోషన్స్ లో బిజీ అయ్యారు. ఇందులో భాగంగానే శ్రద్దా కపూర్ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో అనేక విషయాలను గురించి ప్రస్తావించింది.
తనకు 16 ఏళ్ల వయసు ఉండగా స్కూల్ లో ఓ నాటకం వేసిందట. ఆ నాటకం చూసిన సల్మాన్ ఖాన్ ఫిదా అయ్యాడు. వెంటనే సల్మాన్ తన సినిమాలో శ్రద్దాను తీసుకోవాలని అనుకున్నాడట. దానికోసం సల్మాన్ తనను సంప్రదించారని, కానీ, తనకు సినిమా చేయడం ఇష్టం లేదని చెప్పడంతో సల్మాన్ తో సినిమా చేసే ఛాన్స్ మిస్ అయ్యిందని చెప్తోంది శ్రద్దా కపూర్. కెరీర్లో అందరు ఆషికి 2 ఫస్ట్ సినిమా అనుకుంటున్నారని అంతకు ముందు యశ్ రాజ్ ఫిల్మ్స్ లోనే లవ్ కా ది ఎండ్ సినిమా చేసినట్టు చెప్పింది. తన మొదటి సినిమా తీన్ పత్తి అని అమితాబ్ తో కలిసి నటించానని చెప్పింది. చిన్న పాత్ర అయినా అమితాబ్ తో కలిసి నటించడం చాలా బాగుందని చెప్పింది శ్రద్దా.