ప్రభాస్ సాహో రిలీజ్ కు సిద్ధం అవుతున్నది. మరో ఐదు రోజుల్లో థియేటర్లలో సినిమా రాబోతున్నది. దీనిపై అనేక అంచనాలు ఉన్నాయి. దాదాపు 300 కోట్ల రూపాయల ఖర్చుతో తెరకెక్కిన ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ద్వారా 320 కోట్ల రూపాయలకు పైగా జరిగింది. సో, ఇప్పుడు ఈ మూవీ సేఫ్ కావాలి అంటే కనీసం 350 కోట్ల రూపాయలు పైగా షేర్ వసూలు చేయాలి. ఈ స్థాయిలో షేర్ వసూలు చేయడం అంటే మాములు విషయం కాదు. బాహుబలి తరహాలో విజయం సాధిస్తేనే ఈ మొత్తంలో షేర్ వస్తుంది.
సాహో పై ఆ నమ్మకం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అంతేకాదు, సెన్సార్ టాక్ కూడా పాజిటివ్ గా ఉండటం సినిమాకు కలిసి వచ్చే అంశంగా చెప్పాలి. ఇండియన్ స్క్రీన్ పై ఇప్పటి వరకు ఇలాంటి సినిమా రాలేదని, సినిమా అద్బుతంగా ఉందని సెన్సార్ టాక్ వచ్చింది. ఇది సినిమాను ప్లస్ జోన్ లోకి తీసుకెళ్తుంది అనడంలో సందేహం లేదు. అయితే, ఆగష్టు 30 వ తేదీన వచ్చే రిజల్ట్ ను బట్టే సినిమా ఆధారపడి ఉంటుంది.
ఆగస్టు 30 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతున్నది. ఒకరోజు ముందుగానే ప్రీమియర్ షోలు అటు ఓవర్సీస్ లోను, ఇటు ఇండియాలో వేస్తున్నారు. ప్రీమియర్ షో టికెట్ ధరలు ఇప్పుడు చుక్కల్లో ఉన్నాయి. అయినప్పటికీ ఫ్యాన్స్ టికెట్స్ కోసం పోటీ పడుతున్నారు. ప్రీమియర్ కలెక్షన్లు, ఫస్ట్ డే, వీకెండ్ కలెక్షన్లు ఎలా ఉంటాయి అనేదాన్ని బట్టి సినిమా ఆధారపడి ఉంటుంది. ఫస్ట్ డే భారీ కలెక్షన్లు ఉంటాయి.
ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ సినిమాలో శ్రద్దా కపూర్ హీరోయిన్. ఆమెకూడా పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నది. నిల్ నితిన్, అరుణ్ విజయ్, మందిర బేడీ వంటి నటీనటులు ఈ మూవీలో నటిస్తున్నారు. సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. మరి సినిమా ఎలా ఉన్నదో తెలియాలంటే మాత్రం ఆగష్టు 30 వరకు వెయిట్ చేయాల్సిందే.