భయంకరమైన ఫ్లాపుల్లో ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి అదిరిపోయే హిట్ 'గబ్బర్ సింగ్' సినిమా ద్వారా అందించాడు డైరెక్టర్ హరీష్ శంకర్. సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే అత్యధిక వసూలు చేసిన సినిమాగా అప్పట్లో సంచలనం సృష్టించింది అదేవిధంగా ఇండస్ట్రీలో అనేక రికార్డులు బద్దలు కొట్టింది. ఈ సినిమాతో మెగా ఫ్యాన్స్ కి దగ్గరైనా హరీష్ శంకర్ ఆ తర్వాత సాయి ధరమ్ తేజ్ తో అలాగే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమాలు చేయడం జరిగింది. ప్రస్తుతం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో 'వాల్మీకి' అనే సినిమా చేస్తున్నాడు.


ఈ సినిమా సెప్టెంబర్ 13వ తారీఖున విడుదల కానుంది. తమిళ చిత్రం జిగర్తాండకు అఫీషియల్ రీమేక్ గా రెడీ అవుతున్న ఈ సినిమాలో గతంలో ఎన్నడూ లేని విధంగా వరుణ్ తేజ్ గ్యాంగ్ స్టార్ పాత్రలో నటిస్తున్నాడు. 14 reels ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై నిర్మించబడుతున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ పక్కన  పూజా హెగ్డే, మృణాళిని ర‌వి హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం సినిమా అన్ని హంగులు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. మిక్కి జే మేయర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇటువంటి తరుణంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న హరీష్ శంకర్...తన తర్వాత చేయబోయే ప్రాజెక్టు గురించి అనేక విషయాలు చెప్పుకొచ్చారు.


సోషల్ మీడియాలో అభిమానులతో మాట్లాడుతున్న తరుణంలో హరీష్ శంకర్ తన తదుపరి చిత్రం విషయం నామ మాత్రంగా చెప్పారు. త్వరలోనే తాను రామ్ చరణ్ తో సినిమా చేయబోతున్నట్లు వెల్లడించారు. అందుకు స్క్రిప్టు రెడీ అయ్యిందని చెప్పాడు. కేవలం రామ్ చరణ్ కు మాత్రమే కాక, మహేష్ బాబు కు సైతం పవర్ ఫుల్ స్క్రిప్టు ఉందని స్పష్టం చేశారు. దీంతో ఈ వార్త విని రామ్ చరణ్, మహేష్ అభిమానులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. అయితే రెండు సినిమాలకు సంబంధించి అధికారికంగా వార్తలు మాత్రం ఇండస్ట్రీ పరంగా ఎక్కడా రాలేదు. 



మరింత సమాచారం తెలుసుకోండి: