టాలీవుడ్ చందమామకు కోలీవుడ్ సెన్సార్ బోర్డు పై కోపం వచ్చింది. ఎంతో కష్టపడి సినిమా తీస్తే ఇన్ని కట్స్ ఏంటంటూ ఫైర్ అవుతుంది. ఇలా కత్తిరించడం తనకు నచ్చలేదట. కాజల్ ప్రధాన పాత్రలో నటించిన పారిస్ పారిస్ తెరకెక్కిన విషయం తెలిసిందే. బాలీవుడ్ లో సక్సెస్ అయినా క్వీన్ రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది.
ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇటీవల ఈ సెన్సార్ ముందుకు తీసుకెళ్లారు. అయితే అక్కడ సినిమా టీమ్ కు పెద్దగా షాక్ తగిలింది. ఈ సినిమాలో అసభ్యకరమైన సన్నివేశాలు ఉన్నాయని సెన్సార్ బోర్డు ఏకంగా 25సీన్స్ కట్ చేసేసింది. దాంతో కాజల్ కు చిర్రెత్తుకొచ్చింది. సౌత్ లో అన్ని భాషల్లో క్వీన్ సినిమా రీమేక్ చేసాం.


ఇందులో కాజల్ ఛాతిపై అమ్మాయి చేయి వేసి నొక్కుతున్న దృశ్యాన్ని కూడా అలాగే ఉంచేసారు. కాజల్ గుండెను ఎలీ అవరామ్ ముట్టుకునే సీన్ సంచలనంగా మారింది. ఇక టీజర్ ఇలా ఉంటే సినిమా ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. సినిమాలో ఇలాంటివి చాలా సన్నివేశాలు ఉండటంతో మరో మాట లేకుండా కత్తెరించేసింది సెన్సార్ బోర్డ్. ఆడియన్స్ ఈ సినిమా కోసం బాగానే వెయిట్ చేస్తున్నా.. సెన్సార్ బోర్డ్ మాత్రం ఒప్పుకోవడం లేదు. ‘ప్యారిస్ ప్యారిస్’లో బోలెడు బోల్డ్ సన్నివేశాలు ఉండటంతో కత్తెర వేయక తప్పలేదు. ఇప్పుడు దీనిపై కాజల్ కూడా స్పందించింది. ఒరిజినల్ సినిమాలో ఏమున్నాయో అవే ఇక్కడ కూడా తీసాం.. నేను కూడా కష్టపడి చేసాను.. ఇలా కత్తిరించడం నాకేమాత్రం నచ్చలేదు అంటూ సెన్సార్ బోర్డుపై అసహనం వ్యక్తం చేసింది కాజల్ అగర్వాల్. సినిమా మొత్తమ్మీద ఒకటి రెండు కాదు.. 25 కట్స్ చెప్పారని తెలుస్తుంది.


అసలు సెన్సార్ వాళ్ళు ఎందుకు అన్ని కట్స్ చేశారో అర్ధం కాలేదు. మేము ఎవరి మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తించలేదు. స్నేసర్ వారు కట్ చేసిన సీన్స్ లో నిజంగా అందరి జీవితాల్లో జరిగినవే. ఆ సన్నివేశాలను తిరిగి సినిమాలో పెట్టాలని కోరుతుంది కాజల్. మొదట కోపంతో ఊగిపోయిన ఆ తర్వాత సెన్సార్ బోర్డు కదా కాస్త తగ్గింది.


మరింత సమాచారం తెలుసుకోండి: