ప్రస్తుతం టాలీవుడ్ లక్కీ హీరోలుగా చెప్పుకునే వారిలో నాని, విజయ్ దేవరకొండ, అడవి శేషు అనుకోవొచ్చు.  ఈ హీరోలు నటిస్తున్న సినిమాలు వరుసగా హిట్ అవుతున్నాయి.  టాలీవుడ్ లో మినిమం గ్యారెంటీ హీరోలుగా తమ సత్తా చాటుతున్నారు.  అయితే అడవి శేష్ దర్శకుడిగా 'కర్మ', 'కిస్' లాంటి సినిమాలను స్వీయ నిర్మించారు.  ఆ తర్వాత కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ వచ్చాడు.  అడవి శేష్ చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూనే హీరోగా నటించాలని తపించేవారు.  ఇలా అదృష్టం కలిసి వచ్చి ‘క్షణం’ సినిమాలో మంచి విజయం అందుకున్నాడు.  తాజాగా అడవి శేష్, రెజీనా కాంబినేషన్ లో వచ్చిన ‘ఎవరు’ సూపర్ హిట్ కావడమే కాదు మంచి లాభాలు కూడా తెచ్చిపెట్టింది. 


ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అడివి శేష్ కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు.  ప్రస్తుతం తాను ఈ స్టేజ్ లో ఉన్నానంటే..పీవీపీ అందించిన ప్రోత్సాహమే అన్నారు.  ఒకప్పుడు తాను దారుణమైన స్థితిలోకి వెళ్లానని.. మేం మద్యతరగతి కుటుంబానికి చెందిన వారమే అయిన ధైర్యం చేసి స్వియ నిర్మాణంలో సినిమాలు తీశానని.. ఇక కిస్ సినిమా రెండు కోట్లు పూర్తిగా బయట అప్పులు తెచ్చి మరీ పెట్టుబడి పెట్టానని..కానీ పెట్టిన పెట్టుబడి తిరిగి రాలేదని అన్నారు. 


ఆ సమయంలో అప్పులు ఇచ్చిన వారు పెట్టిన బాధలు అన్నీ ఇన్నీ కావని అన్నారు. జేబులో ఒక్క రూపాయి లేని స్థితి చేరుకున్నానని.. అప్పిచ్చిన వాళ్లు పోలీసులతో బెదిరించారని.. ఒకానొక సమయంలో ఢిల్లీలో పది మంది పోలీసుల మధ్య నిలబడాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. ఆ సమయంలో నా మీద నమ్మకంతో పీవీపీ ‘క్షణం ’ మూవీలో ఛాన్స్ ఇచ్చాడు.  అప్పటి నుంచి నేనే వెనక్కి తిరిగి చూసుకోలేదని అన్నారు. 


తాను బాధలో ఉన్న సమయంలో ఉండగా.. తనను నమ్మి 'క్షణం' సినిమా తీసిన పీవీపీని అతడు ప్రశంసలతో ముంచెత్తాడు. ఒకప్పటి తన దీన స్థితిని గుర్తు చేసుకుని ఆ సమయంలో పీవీపీ అందించిన ప్రోత్సాహం గురించి చెప్పుకొచ్చాడు. టాలీవుడ్ లో టాలెంటెడ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు అడివి శేష్. నటించడంతో పాటు తన సినిమాలకు స్క్రిప్ట్ లు కూడా రాసుకుంటూ తన ప్రత్యేకతను చాటుతున్నాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: