'ఈగ' ఫేమ్ కిచ్చా సుదీప్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం ప‌హిల్వాన్‌.  ఈ సినిమాను ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ వారాహి చ‌ల‌న చిత్రం తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించ‌నున్నారు. ఈ యాక్ష‌న్ డ్రామాలో సుదీప్ రెజ్ల‌ర్ పాత్ర‌లో క‌నిపిస్తారు. తెలుగులోనూ ప‌హిల్వాన్‌ అనే పేరుతోనే సెప్టెంబర్  12న ఈ చిత్రాన్ని విడుద‌ల కానుంది. అయితే ఈ సినిమా పై సౌత్ అన్ని భాషల్లో మంచి అంచనాలు ఉన్నాయి.  కాగా ఇటీవలే  విడుదలైన  పహిల్వాన్  ట్రైలర్, సినిమా పై భారీగా అంచనాలను పెంచేసింది. ట్రైలర్ చూస్తే  ఒక కుస్తీ వీరుడు బాక్సింగ్ రింగ్ లో దిగితే ఎలా ఉంటుందో ఈ చిత్రంలో చూడొచ్చనిపిస్తుంది. తన కలల సాకారం కోసం  ఓ వ్యక్తి చేసిన మానసిక, శారీరక పోరాటం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కినట్లు ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది.  సీనియర్ బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి సుదీప్ గురువుగా కనిపిస్తున్నారు. 


ఎస్‌.కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ న‌టుడు సునీల్ శెట్టితో పాటు ఆకాంక్ష సింగ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. అర్జున్ జ‌న్యా సంగీతం అందించిన ఈ సినిమాకు క‌రుణాక‌ర్ సినిమాటోగ్ర‌ఫీ అందించారు.  ప‌హిల్వాన్‌ చిత్రంతో కూడా మరో విజయాన్ని అందుకుంటామని నమ్మకంగా చెబుతుంది ప్రముఖ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థ వారాహి  వారాహి సంస్థ.    ఇప్పటికే కన్నడ చిత్రం 'కె.జి.ఎఫ్' చిత్రాన్ని తెలుగులోకి అనువదించి ప్రాపర్ పెద్ద తెలుగు సినిమాను ఏ స్థాయిలో రిలీజ్ చేస్తారో అదే భారీ స్థాయిలో రిలీజ్ చేశారు.  ఆ చిత్రం ప్రేక్షకులను విశేషంగా అలరించి భారీ లాభాల్ని తెచ్చి పెట్టింది.  దీంతో ఈ కన్నడ సినిమాని కూడా ఇప్పుడు అదే స్థాయిలో రిలీజ్ చేయబోతుంది వారాహి సంస్థ.  ప్రపంచవ్యాప్తంగా 2500 స్క్రీన్లలో చిత్రాన్ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు.   తెలుగులో కూడా పెద్ద ఎత్తున రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.   మరి 'కె.జి. ఎఫ్' ఇచ్చిన సక్సెస్ 'పహిల్వాన్' కూడా ఇస్తుందేమో చూడాలి.  తమిళం, హిందీ, మలయాళ పరిశ్రమల్లో కూడా అక్కడి డిస్ట్రిబ్యూటర్లు భారీ లాభాలను తెస్తుందేమో.  

ReplyForward


మరింత సమాచారం తెలుసుకోండి: