పేరుకు పెద్ద హూటల్స్..కానీ రోడ్ సైడ్ హోటల్స్ కన్నాఅద్వాన్న పరిస్థితుల్లో ఉంటున్నాయని ఈ మద్య తెగ వార్తలు వస్తున్నాయి. వాటిని నిరూపిస్తూ ఎన్నో సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. స్టార్ హూటల్స్ లో అడ్డగోలు వసూళ్లు కూడా చేస్తున్నట్లు పలు సంఘటనలు వెలుగు లోకి వచ్చాయి. సెలబ్రెటీలకు వరుసగా ఛేదు అనుభవాలు ఎదురువుతున్నాయి. ఆ మద్య బాలీవుడ్ హీరో రాహుల్ బోస్ చండీగడ్‌లో ఓ షూటింగ్ నిమిత్తం ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌లో బస చేశాడు.హోటల్‌లో జిమ్‌కు వెళ్లి వచ్చిన తర్వాత రెండు అరటి పండ్లను ఆర్డర్ చేశాడు.వాటికి సెంట్రల్ జీఎస్టీ రూ.33.75, యూటీ జీఎస్టీ రూ.33.75 జీఎస్టీతో కలిపి రూ.442.50 బిల్లు వేయడంతో రాహుల్ షాకయ్యాడు. 


ఈ విషయాన్ని ట్విట్టర్ లో ప్రస్తావించాడు. ఇది జరిగి కొన్ని రోజులైనా కాకముందే ముంబైలో ఇలాంటి ఘటన మరొకటి జరిగింది. కార్తీక్ అనే వ్యక్తి ముంబైలోని ఫోర్ సీజన్ అనే హోటల్ కు వెళ్ళాడు.  అక్కడ రెండు గుడ్లు, ఒక ఆమ్లెట్ ఆర్థర్ చేశాడు.  తీరా తిన్నాక బిల్లు చూసి షాక్ అయ్యాడు.  రెండు కోడిగుడ్ల ధర రూ. 1700 /-.  ఆమ్లెట్ ధర రూ. 850/- వేయడంతో షాక్ అయ్యాడు.  తాను హోటల్ ఆర్డర్ చేసిన ఆర్డర్ మొత్తం కలిపి రూ. 6938/-అయ్యింది.  చేసేది లేక బిల్లు చెల్లించి.. ఆ రిసీట్ ను సోషల్ మీడియాలో  పోస్ట్ చేశాడు.  తాజాగా ఇంతకంటే దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. లక్షలు ఖర్చు పెట్టి హోటల్స్ లో స్టే చేస్తుంటే కనీసపు శుభ్రత పాటించకుండా సెలబ్రిటీలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. తాజాగా ప్రముఖ నటి మీరాచోప్రాకి కూడా ఇలాంటి సంఘటనే ఎదురైంది.   


గుజరాత్ రాష్ట్ర రాజధాని అహ్మదాబాద్ నగరంలోని ఫైవ్ స్టార్ హోటల్ లో ఉంది. వారం రోజులుగా అదే హోటలో ఉంటున్న ఆమె ఒక్కసారే అనారోగ్యానికి గురి కావడంతో ఏంటీ కారణం అన్న విషయంపై ఆలోచించ సాగింది.  ఈ క్రమంలోనే తనకు వచ్చే ఆహారాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించి తినడం మొదలు పెట్టింది.  ఈ సమయంలోనే ఆమె షాకింగ్ గురిచేసే విషయం బయటపడింది. ఆమెకి తన ప్లేట్ లో తెల్ల పురుగులు కనిపించాయి.దీంతో ఆమె నోటి వెంట మాట రాలేదు.


తన చేతిలోని ఫోన్ తో ఆ ఫుడ్ ను వీడియోగా తీసి ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు.  ఇంత పెద్ద హూటల్స్ లో భారీగా ఛార్జీలు వసూళ్లు చేస్తారు..కానీ తిండి విషయంలో ఇంత దారుణమైన సరఫరా చేస్తారా అని ఫైర్ అయ్యింది. తనకీ చేదు అనుభవాన్ని మిగిల్చిన హోటల్ పేరును చెబుతూ.. తాను ఉన్నది డబుల్ ట్రీ హెల్టన్ హోటల్ అని చెప్పారు. ఎంతో డబ్బు చెల్లించి ఇలాంటి హోటల్స్ లో ఉంటుంటే వారు మాత్రం కనీసం సరైన ఆహారం వడ్డించకుండా  నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారని అసహం వ్యక్తం చేస్తోంది.  తాజాగా దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: