అడివి శేష్ కథానాయకుడిగా రెజీనా కథానాయకగా వెంకట్ రాంజీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ఎవరు'. ఈ చిత్రం ఆగష్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా ప్రేక్షకుల ముందుకు వచ్సిన సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సినిమా అంత అద్భుతంగా ఉంది. 


క్షణ క్షణం ఉత్కంఠం రేపుతూ లాస్ట్ వరుకు సస్పెన్స్ తో ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా రిలీజ్ అయ్యి పది రోజులు అయినా ఏ మాత్రం ఊపు తగ్గకుండా థియేటర్స్ లో అలరిస్తుంది. ఈ సినిమా చుసిన ప్రతి ఒక్కరు ఈ సినిమా అద్భుతం అని అంటున్నారు అంత గొప్పగా తెరకెక్కించ్చారు ఈ క్రైమ్ థ్రిల్లర్ ని. 


ఈ నేపధ్యంలోనే ఈ సినిమాను చూసినా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ట్విట్టర్ వేధికగా స్పందిస్తూ సినిమా అద్భుతంగా ఉందని ట్విట్ చేశారు. మహేష్ బాబు స్పందిస్తూ 'ఎవరు సినిమా చూడటం జరిగింది, థ్రిల్లర్ కథాంశంతో ఎంతో అద్భుతంగా ఈ సినిమాను తెరకెక్కించి, ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా యూనిట్ కి, అలానే అడివి శేష్ కు ప్రత్యకంగా అభినందనలు తెలుపుతూన్నా' అంటూ మహేష్ ట్విట్ చేశాడు. 


ఈ ట్విట్ కి స్పందించిన అడివి శేష్ 'సర్, మీరు గ్రేట్ ! మీ అభినందన మా టీమ్ కి బలాన్ని ఇచ్చింది' అంటూ ట్విట్ చేశారు. నవీన్ చంద్ర స్పందిస్తూ ' సూపర్ స్టార్ మహేష్ బాబు గారు మీరు గ్రేట్ అనడం మాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు సార్' అంటూ ట్విట్ చేశారు. ఏది ఏమైనా సస్పెన్స్ థ్రిల్లర్ ఇష్ట పడేవారు ఈ సినిమాను చూస్తే పండుగా చేసుకుంటారు.


మరింత సమాచారం తెలుసుకోండి: