డాలర్ డ్రీమ్స్ సినిమాతో టాలీవుడ్ కి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన దర్శకుడు శేఖర్ కమ్ముల. అయితే తోలి చిత్రం ఆయనకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. అయినప్పటికీ పట్టు వదలకుండా, దాదాపుగా ఐదేళ్లు విరామం తీసుకుని, ఆ తరువాత రాజా, కమలిని ముఖర్జీల కలయికలో ఆనంద్, ఒక మంచి కాఫీ లాంటి సినిమాని తెరకెక్కించారు శేఖర్. అప్పట్లో మంచి క్లాస్ మూవీ గా ఈ సినిమా ప్రేక్షకుల మన్ననలు అందుకోవడం జరిగింది. ఇక ఆ తరువాత సుమంత్, కమలిని కలయికలో శేఖర్ తెరకెక్కించిన గోదావరి సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. అనంతరం అంతా కొత్తవాళ్లతో శేఖర్ తీసిన హ్యాపీ డేస్ సినిమా, అప్పట్లో అతి పెద్ద సంచలన విజయాన్ని అందుకుని కాలేజీ కుర్రకారు గుండెలను స్పృశించింది. అయితే ఆ తరువాత వరుసగా శేఖర్ తీసిన సినిమాల్లో, రానా హీరోగా వచ్చిన లీడర్ మాత్రమే పర్వాలేదనిపిచింది. 

అయినప్పటికీ శేఖర్ ఏ మాత్రం తగ్గకుండా ఈసారి వరుణ్, సాయి పల్లవితో సినిమా తీయాలని డిసైడ్ అయి ఫిదా సినిమాను తెరకెక్కించడం జరిగింది. ఇక ఈ సినిమా ఎంతటి అద్భుత విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే. ఆ సినిమాతో హీరో వరుణ్ తేజ్ తో పాటు, సాయి పల్లవికి హీరోయిన్ గా ఎంతో పేరు, ప్రఖ్యాతలు లభించడం జరిగింది. ఇక ఆ సినిమా వచ్చిన రెండేళ్లకు మళ్ళీ శేఖర్ మరొక సినిమాతో మన ముందుకు రాబోతున్నారు. నాగచైతన్య, సాయి పల్లవి కలయికలో త్వరలో రూపొందనున్న ఈ సినిమా అధికారిక పూజ కార్యక్రమాలు ఇటీవల సికింద్రాబాద్ లోని గణేష్ ఆలయంలో ఘనంగా జరిగాయి. విజయ్ సి కుమార్ కెమెరా మ్యాన్ గా పనిచేయబోతున్న ఈ సినిమాను ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్ గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా కథ కూడా ఫిదా మాదిరి మంచి రొమాంటిక్ లవ్ స్టోరీ అని నేడు కొన్ని టాలీవుడ్ వర్గాలలో ప్రచారం అవుతోంది. 

నిజమైన ప్రేమలోని మరొక కోణాన్ని శేఖర్ ఈ సినిమాలో చూపించబోతున్నారని, ఇప్పటివరకు అయన నుండి వచ్చిన ఆనంద్, గోదావరి, ఫిదా తరహా లోనే ఈ సినిమా కూడా మంచి ఫీల్ గుడ్ లవర్ స్టోరీ గా ఆడియన్స్ కి కిక్ ఇస్తుందని సమాచారం. ఇక ఈ న్యూస్ బయటకు రావడంతో సినిమా రేపు రిలీజ్ తరువాత మంచి హిట్ సాధించడం ఖయాం అని చైతు ఫ్యాన్స్ అప్పుడే సంబరాలు మొదలెట్టేసారు. అయితే ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త పై ఆ సినిమా యూనిట్ నుండి అధికారిక ప్రకటన వెలువడవలసి ఉంది....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: