అనుష్క శెట్టి చివరగా "భాగమతి" సినిమా నటించింది. హరర్ జానర్ లో వచ్చిన ఆ సినిమా తెలుగు మరియు తమిళ భాషాల్లో మంచి విజయం సాధించింది. ఆ సినిమా విడుదల అయ్యి దాదాపు 16 నెలలు అవుతుంది . ఇప్పుడు అనుష్క శెట్టి ఒక క్రేజీ ప్రాజెక్ట్ తో మన ముందుకు రానుంది. అయితే ఇది ఒక క్రాస్ ఓవర్ సినిమా.ఇందులో హలీవుడ్ ,టాలీవుడ్ ,కోలీవుడ్ నటీనటుల కాంబినేషన్ లో వస్తున్న సినిమా.హేమంత్ మధుకర్ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో రాబోతున్న సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ‘సైలెన్స్’. తెలుగులో ఈ సినిమా ‘నిశ్శబ్దం’గా వస్తుంది. .
కోన వెంకట్ ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయలను వెల్లడించారు.ఈ సినిమా పూర్తి చేయడానికి దాదాపు రెండు సంవత్సరాలు కష్టపడ్డం. వచ్చే నెలలో టీజర్ ని విడుదల చేస్తాం. ఈ సినిమా లో గ్రాఫిక్స్ కి ఎక్కువగా స్కోప్ ఉంది. గ్రాఫిక్స్ మేము అనుకున్న విధంగా వస్తే డిసెంబర్ లో రిలీజ్ చేస్తాం లేదా జనవరిలో రిలీజ్ చేస్తాం. సైలెన్స్’కి కోన వెంకట్ నిర్మతగా వ్యవహిస్తున్నారు.
ఈ సినిమాలో కిల్ బిల్ సినిమాలో ప్రతి నాయకుడి పాత్రలో నటించిన మైఖేల్ మ్యాడిసన్ తో పాటు 7 గురు హలీవుడ్ నటీనటులు పని చేస్తున్నారు.హలీవుడ్ కి చెందిన టాప్ టెక్నీషియన్స్ ఈ సినిమాకు పని చేస్తున్నారు.సైలెన్స్ మూవీ అమెరికా బ్యాక్ డ్రాప్ లో సాగే కథ.నాలుగురు ఇండియన్స్ కి మరియు అమెరికాన్ పోలీసులకి మధ్య జరిగే సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్.
ఈ సినిమా అనుష్క ఒక ఆర్ట్ లవర్ గా కనబడనుంది.ఈ సినిమాలో మాధవన్ , సుబ్బరాజు, అంజలి, షాలిని పాండే ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.ఈ సినిమాను తెలుగు, తమిళం,హీంది,ఇంగ్లీష్ భాషాల్లో విడుదల చేస్తున్నారు. సైలెన్స్’ సినిమాని హై టెక్నీకల్ వాల్యూస్ తో ఎక్కడ కాంప్రమైజ్ అవకుండా నిర్మిస్తున్నారు.