బాలీవుడ్ బాద్ షా న్యూ మూవీకి మీటు సెగ తగిలింది. షారుఖ్ ఖాన్ తీసుకున్న షాకింగ్ డెసిషన్ ఆయనకు తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఆ దర్శకుడితో చేయొద్దంటూ కింగ్ ఖాన్ పై ట్రోల్స్ చేస్తున్నారు. 


బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కొంత కాలంగా సక్సెస్ లు లేక ఇబ్బందులు పడుతున్నాడు. షారుఖ్ ఎన్నో ఆశలు పెట్టుకున్న జీరో చిత్రం ఆయనను మరింత కిందకు దిగజార్చింది. దీంతో కాస్త గ్యాప్ తీసుకున్న బాద్ షా ఎట్టకేలకు కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు. బీటౌన్ బాక్సాఫీస్ వండర్స్ కు కేరాఫ్ అడ్రస్ అయిన రాజ్ కుమార్ హిరానీ.. షారుఖ్ కొత్త చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇదే ఇపుడు కింగ్ ఖాన్ కు కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది. 


దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ మీటూ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఒక మహిళ తనను రాజ్ కుమార్ హీరానీ లైంగికంగా వేధించాడంటూ కొద్ది రోజుల కిందట కేసు పెట్టింది. దీంతో షారుఖ్ ఖాన్, రాజ్ కుమార్ హిరానీతో సినిమా చేయొద్దంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ నడుస్తున్నాయి. బాలీవుడ్ పెద్దలు ఆ మధ్య మీటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని బహిష్కరించాలని నిర్ణయించారు. 


షారుఖ్ ఖాన్ బాలీవుడ్ నిబంధనలను పట్టించుకోకుండా రాజ్ కుమార్ హిరానీతో సిినిమా చేస్తుండటంతో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో బాలీవుడ్ లో పలువురు స్టార్స్ మీటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న టెక్నీషియన్స్ ను తమ సినిమాల నుండి తొలగించారు. కానీ షారుఖ్ మాత్రం అవేవీ పట్టించుకోకుండా రాజ్ కుమార్ హిరానీతో సినిమా చేస్తుండటంతో మీ టూ సెగ షారుఖ్ పై పడుతోంది. మరి ఈ విమర్శలపై షారుఖ్ ఎలా స్పందిస్తాడో చూడాలి. మొత్తానికి షారుఖ్ ఖాన్ ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమాను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో కొద్ది రోజుల్లో తేలనుంది. 




మరింత సమాచారం తెలుసుకోండి: