పూజా హెగ్డే.. టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతున్నది.   ఇప్పటికే అనేక సినిమాల్లో ఆఫర్లు దక్కించుకున్న ఈ కన్నడ భామ ఇప్పుడు మరో సినిమాలో అవకాశం దక్కించుకుంది.  అదీ మెగా ప్రొడక్షన్ సినిమాలో.  అఖిల్ హీరోగా, బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది.  ఈ సినిమాలో హీరోయిన్ కోసం చాలామందిని ట్రై చేశారు.  


కానీ కథకు తగిన హీరోయిన్ కోసం ఇంతకాలం వెయిట్ చేశారట.  చివరకు ఆ అవకాశం పూజా హెగ్డే కు దక్కింది.  పూజా హెగ్డే ప్రస్తుతం చాలా బిజీగా మారిపోయిన సంగతి తెలిసిందే.  డీజే సినిమాకు ముందు చాలా సినిమాలు చేసింది.  కానీ, ఆమె క్రేజ్ జీరో.  డీజే సినిమాలో బికినీతో మెరుపులు మెరిపించడంతో.. ఆమె క్రేజ్ పెరిగింది.  


డీజే తరువాత అరవింద సమేత చేసింది.  అది హిట్టైంది.  మహేష్ బాబుతో చేసిన మహర్షి బంపర్ హిట్ అయ్యింది.  ఇప్పుడు ప్రభాస్.. రాధాకృష్ణ కాంబినేషన్లో వస్తున్న సినిమాలో చేస్తున్నది.  దీంతోపాటు అటు అల్లు అర్జున్ .. త్రివిక్రమ్ కాంబినేషల్లో తెరకెక్కుతున్న అల వైకుంఠపురంలో నటిస్తున్నది ఈ అమ్మడు.  ఇవే కాదు.. రేపు సెప్టెంబర్ 12 వ తేదీన రిలీజ్ కాబోతున్న వాల్మీకి సినిమాలో కూడా ఈమెనే హీరోయిన్.  


ఇక్కడ విషయం ఏమిటంటే.. తమిళ్ వెర్షన్ జిగర్తాండ సినిమాలో విజయ్ సేతుపతి హీరోయిన్ లేదు.  కానీ తెలుగు సినిమాలో హీరో కు హీరోయిన్ లేకుంటే సినిమాకు క్రేజ్ ఉండదు.  అందుకే వరుణ్ తేజ్ కు జోడిగా పూజా హెగ్డే కోసం ఓ ప్రత్యేకంగా పాత్రను సృష్టించారు.  ఆ పాత్ర సినిమాకు హైలైట్ గా ఉంటుందని అంటున్నారు.  ఈ సినిమాలతో పాటు పూజా అటు బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తున్నది.  సో, ఇప్పుడు స్టార్ హీరోలకు పూజా హెగ్డే చాయిస్ గా మారింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: