కర్నూలులోని కొండారెడ్డి బురుజు సెంటర్ అంటే ఏపి ప్రజలకు బాగానే గుర్తుకు ఉంటుంది. కర్నూల్ లో కర్నూలులోని కొండారెడ్డి బురుజు సెంటర్ అంటే ఎంతో ఫేమస్. అయితే తెలుగు సినిమా ప్రేక్షకులకు కూడా ఈ పేరు బాగానే గుర్తుకు ఉంటుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో నిర్మాత, దర్శకులు గుణశేఖర్ దర్శకత్వంలో ‘ఒక్కడు’తో సూపర్ హిట్ అందించారు. 

ఆ తర్వాత మహేష్ బాబు అతడు, పోకిరి,దూకుడు ఇలా వరుస విజయాలతో నెంబర్ వన్ రేస్ లోకి వెళ్లిపోయారు.  అయితే ఒక్కడు సినిమాలో భూమికను ప్రకాశ్ రాజ్ నుంచి కాపాడే సీన్ ‘కొండారెడ్డి బురుజు’వద్ద ఉంటుంది.   ఇక్కడ ప్రకాశ్ రాజ్ తో మహేశ్ చేసిన ఫైట్ హైలైట్. ఆపై మళ్లీ కొండారెడ్డి బురుజు సెంటర్ మరోసారి మహేశ్ సినిమాలో కనిపించలేదు. ప్రస్తుతం మహేష్ బాబు, అనీల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.  చాలా కాలం తర్వాత 'సరిలేరు నీకెవ్వరు' సినిమా కోసం అదే బురుజు అవసరమైంది.

'ఒక్కడు' కోసం బురుజు వద్దే షూటింగ్ నిర్వహించగా, తాజాగా ఈ మూవీ కోసం దాదాపు రూ. 4 కోట్ల వ్యయంతో అదే విధమైన సెట్ ను హైదరాబాద్ లోని ఓ స్టూడియోలో నిర్మించారు.  ఈ సన్నివేశంలో మహేష్ బాబు, రాజేంద్ర ప్రసాద్ ల మద్య జరగబోతుందట. ఈ మూవీ దిల్ రాజు, అనీల్ సుంకర లతో కలిసి మహేష్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. 

మహష్ బాబు సరసన కన్నడ బ్యూటీ రష్మిక మందన నటిస్తుంది. ఇక ఈ మూవీలో మరో హైలెట్ ఏంటంటే చాలా కాలం తర్వాత లేడీ అమితాబ్ విజయశాంతి ముఖ్య పాత్రలో కనిపించబోతుంది.  2020 సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది. అయితే గుణశేఖర్ దర్శకత్వంలో మహేష్ నటించిన ‘ఒక్కడు’ కొండారెడ్డి బురుజు సెంటిమెంట్ గనక వర్క్ ఔట్ అయితే ఈ సినిమా కూడా సూపర్ హిట్టే అంటున్నారు మహేష్ అభిమానులు. 


మరింత సమాచారం తెలుసుకోండి: