సోలో హీరోగా   వరుసగా  హ్యాట్రిక్ విజయాలను  ఖాతాలో వేసుకున్నాడు  ట్యాలెంటెడ్ యంగ్ హీరో అడివి శేష్.  అందులో భాగంగా   గతంలో ఆయన నటించిన  క్షణం , గూఢచారి చిత్రాలు  మంచి విజయాలు సాదించగా తాజాగా నటించిన ఎవరు  కూడా సూపర్  హిట్ అనిపించుకుంది.   మర్డర్ మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవల విడుదలై  బాక్సాఫీస్ వద్ద  డీసెంట్ వసూళ్లను రాబట్టి బయ్యర్లకు  లాభాలను  తీసుకొచ్చింది. ఓవర్సీస్ లో అయితే ఈ సినిమా  బ్లాక్ బాస్టర్ విజయాన్ని నమోదుసి చేసింది. 



నూతన దర్శకుడు  వెంకట్ రాంజీ తెరకెక్కించిన ఈ చిత్రంలో రెజీనా కసాండ్రా, నవీన్ చంద్ర ముఖ్య పాత్రల్లో నటించారు. పివిపి నిర్మించిన  ఈ చిత్రం స్పానిష్ థ్రిల్లర్ 'ది ఇన్విజిబుల్ గెస్ట్' కు రీమేక్ గా తెరకెక్కింది. అయితే  తెలుగు నేటివిటీ కి తగ్గట్లు  చాలా మార్పులు చేశారు.  ఇక ఈ చిత్రం తరువాత  అడివి శేష్ ,'మేజర్' అనే చిత్రంలో నటించనున్నాడు.  11/26 ముంబై దాడుల్లో మరణించిన   ఆర్మీ  మేజర్ సందీప్  ఉన్ని కృష్ణన్   పాత్రలో నటించనున్నాడు  శేష్. ఈ పాత్ర కోసం అతను ఏకంగా 10 కిలోల  బరువు తగ్గనున్నాడట. 





 ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో లో  వున్న  ఈ చిత్రం త్వరలోనే  సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈచిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబు  సొంత బ్యానర్  జి ఏం బి  ప్రొడక్షన్స్ నిర్మించనుంది. ఇక ఈ చిత్రంతో పాటు  గత ఏడాది  విడుదలై సూపర్ హిట్ సాధించిన  యాక్షన్ థ్రిల్లర్  'గూఢచారి' చిత్రానికి  సీక్వెల్ గా తెరకెక్కనున్న  చిత్రంలో కూడా నటించనున్నాడు శేష్ . గూఢచారి 2 అనే టైటిల్ తో రూపొందనున్న ఈ చిత్రం  గురించి  త్వరలోనే మరిన్ని వివరాలు  వెలుబడనున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: