‘సాహో’ ను నెగిటివ్ టాక్ తో మొదటిరోజు మొదటి షో నుండి ఇరుకున పెట్టాలని కొందరు ప్రభాస్ వ్యతిరేకులు చేస్తున్న కుట్ర ప్రభాస్ దృష్టి వరకు రావడంతో ఈ మూవీ విషయంలో రాబోయే నెగిటివ్ టాక్ ను కట్టడి చేయడానికి ప్రభాస్ సరికొత్త వ్యూహాలు రచిస్తున్నట్లు టాక్. ఈమూవీకి స్పెషల్ షోలను వేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 29 తారీఖు అర్దరాత్రి నుండి అనుమతులు ఇచ్చినా ఈమూవీ స్పెషల్ షోలు కేవలం 30వ తారీఖు తెల్లవారుజామున 5 గంటల నుండి  ప్రారంభించి ఈ మూవీ పై కొందరు ప్రచారంలోకి తీసుకు రావాలని భావిస్తున్న నెగిటివ్ టాక్ ను కట్టడి చేయాలని ఆలోచనలలో ప్రభాస్ ఉన్నట్లు తెలుస్తోంది. 

ప్రభాస్ కు ఈ వ్యూహం అనుసరించడం వెనుక ఒక ఎత్తుగడ ఉంది అని అంటున్నారు. తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమాకు సంబంధించి స్పెషల్ షోలు  ప్రారంభం అయ్యే సమయానికే అమెరికాలో ఈ మూవీ ప్రీమియర్ షోలు ప్రారంభం అవుతాయి కాబట్టి ఈమూవీ పై అటు ఓవర్సీస్ ప్రేక్షకులు అదేవిధంగా తెలుగు ప్రేక్షకులు ఇచ్చే తీర్పు ఒకే సమయానికి వచ్చే విధంగా సమాంతరంగా ఈమూవీ ప్రీమియర్ షోల టైమ్స్ ను ప్రభాస్ సెట్ చేసినట్లు సమాచారం. 

దీనితో ఓవర్సీస్ టాక్ పేరుతో కాని లేదంటే స్పెషల్ షోల టాక్ పెరుతోగాని ముందుగానే కొందరు పనికట్టుకుని ప్రచారం చేసే వ్యతిరేక ప్రచారాన్ని సాధ్యమైనంత తగ్గించ వచ్చు అని ప్రభాస్ అభిప్రాయ పడుతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా ఈసినిమాలో ఉండే ఆఖరి 30 నిముషాలలోనే ఈ సినిమాలోని మేజర్ ట్విస్ట్ లు బయట పడతాయని అప్పటి వరకు ప్రేక్షకులు సస్పెన్స్ లోనే కొనసాగుతారు అని లీకులు వస్తున్నాయి. 

ఈ మూవీలో వచ్చే ఫాదర్ సెంటిమెంట్ యాంగిల్ కూడ ఈ మూవీకి కీలకంగా మారుతుందని ప్రభాస్ ఈ మూవీలో ద్విపాత్రాభినయం చేయడుకాని రెండు షేడ్స్ కలిగిన పాత్రలలో ప్రభాస్ నటను చూసిన వారికి ఈ మూవీలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేసాడా అని అనిపించడం సహజం అంటున్నారు. ఈ మూవీ ఖచ్చితంగా మొదటిరోజు 120 కోట్లు వసూలు చేస్తుంది అన్న ప్రాధమిక అంచనాలలో ఇండస్ట్రీ వర్గాలు ఉన్నాయి..    


మరింత సమాచారం తెలుసుకోండి: