ప్రస్తుతం దేశం మొత్తం ‘సాహూ’మానియా పట్టుకుంది.  సుజిత్ దర్శకత్వంలో భాస్, శ్రద్ధా కపూర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ ‘సాహో’. ఆగస్టు 30న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది.  యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘బాహుబలి 2’ తరవాత వస్తోన్న సినిమా కావడంతో దేశ వ్యాప్తంగా ‘సాహో’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రేక్షకుల అంచనాలకు ఎక్కడా తగ్గకుండా హాలీవుడ్ స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కించినట్టు ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. 

రన్ రాజా రన్ తర్వాత సుజిత్ కి ప్రభాస్ ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇవ్వడానికి కారణం కేవలం తనకు కథ నచ్చడం వల్లే అన్నాడు.  ఈ మూవీలో జాతీయ స్థాయిలో రిలీజ్ కాబోతుంది. అందుకే ఇందులో నటులు చాలా వరకు బాలీవుడ్ కి సంబంధించిన వారు కావడం విశేషం. నీల్ నితిన్ ముఖేశ్, జాకీష్రాఫ్, అరుణ్ విజ‌య్‌, లాల్‌, ప్రకాష్ బెల్వాది, ఎవిలిన్ శ‌ర్మ, చుంకి పాండే, మందిరా బేడి, మ‌హేష్ మంజ్రేకర్‌, టిను ఆనంద్‌, శ‌ర‌త్ లోహిత‌ష్వా వంటి బాలీవుడ్, కోలీవుడ్ స్టార్లతో పాటు వెన్నెల కిషోర్‌ ‘సాహో’ చిత్రంలో నటించారు. 

దీనికి తోడు జిబ్రాన్ నేపథ్య సంగీతం, మధి సినిమాటోగ్రపీ సినిమాకు ప్రత్యేక ఆకర్షణలు కానున్నాయి. యూవీ క్రియేషన్స్ పతాకంపై ప్రమోద్, వంశీ, విక్రమ్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇక సాహూకి  సెన్సార్ బోర్డు యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చింది. ఆన్‌లైన్ బుకింగ్ శనివారం నుంచి ప్రారంభమైంది. బాలీవుడ్ లో ఖాన్ ల త్రయం సినిమాలు విడుదలయ్యే సమయంలో కనిపించే హడావుడి 'సాహో' హిందీ వర్షన్ కు కనిపిస్తోంది.

అయితే బుక్ మై షోలో ఈ మూవీకి మూడున్నర లక్షలకు పైగా లైక్స్ రావడం గమనార్హం.  హైదరాబాద్‌లో తొలిరోజు అన్ని షోలకు ఆన్‌లైన్‌లో పెట్టిన టిక్కెట్లు దాదాపు ఖాళీ అయిపోయాయి. ఎక్కడో హైదరాబాద్ శివారులోని కొన్ని థియేటర్లలో అక్కడక్కడ ఒక్కో టిక్కెట్ మిగిలిలి ఉంది. ఇంకా కొన్ని థియేటర్లు యాడ్ కావాల్సి ఉంది.  మొత్తానికి సాహూ ఈ విషయంలో కూడా సెన్సేషన్ క్రియేట్ చేయడం ఫ్యాన్స్ ఖుషీ లో ఉన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: