దువ్వాడ జగన్నాధం, అరవింద సమేత, మహర్షి వంటి హిట్స్ తో టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ పొజిషన్ కు చేరుకున్న పూజాహెగ్డేను గూర్చి కొత్తగా జనాలకు పరిచయం చేయనక్కర్లేదు. మోడలింగ్‌ రంగం నుండి సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు మొదటగా మిస్కిన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ముఖముడి చిత్రంతో కోలీవుడ్‌కు పరిచయం అయ్యింది. ఆ చిత్రం నిరాశపరచడంతో పూజాను తమిళసినిమా మరచిపోయింది.


ఆ తరువాత టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది.అయితే.. అల్లుఅర్జున్, ఎన్టీఆర్, మహేశ్‌బాబు వంటి స్టార్లతో హిట్స్ దక్కించుకోవడమే కాకుండా అడపాదడపా ఐటమ్‌ సాంగ్స్ లోనూ ఆడిపాడుతుంది ఈ ముద్దుగుమ్మ. ఇక  ప్రస్తుతం టాలీవుడ్‌లో రెండు చిత్రాలు పూజా చేతిలో ఉన్నాయి. అవీ కాక బాలీవుడ్ లో  హౌస్‌పుల్‌ 4 సినిమాలో నటిస్తోంది. అలాగే కోలీవుడ్‌లో పాగా వేయాలని ఎప్పటినుండో  ఆశతో ఉన్న పూజా.. అందులో భాగంగానే అందరి హీరోయిన్ల మాదిరి గానే అందాలు ఆరబోస్తూ ప్రత్యేకంగా ఫొటో సెషన్‌ను ఏర్పాటు చేసి, ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే ఆ ఫొటోలపై నెటిజన్స్ పూజాను తీవ్రంగా విమర్శిస్తూ కామెంట్స్ చేశారు. 


దీంతో.. అలాంటి వారికి పూజా బదులిస్తూ.. దేహమే ఆలయం అని మన పెద్దలు అన్నారని, అదే విధంగా తన దేహాన్ని తాను ఆరాధిస్తానని చెప్పింది. అంతే కాకుండా అందాలను ప్రదర్శిస్తున్నాను.. ఇందులో తప్పేముంది? మీరు అంతగా వర్రీ అవ్వాల్సిన పనేముంది? అని ఎదురు ప్రశ్నించింది. అవకాశాల కోసం అందాల ఆరబోతలో డోస్ పెంచి విమర్శల పాలై ఇప్పుడు తాను చేసిన పనిని తానే సమర్ధించుకోవడంతో విస్తుపోవడం ఇప్పుడు అభిమానుల వంతయ్యింది. మంచి చెప్పినా మరో విధంగా తీసుకోవడంతో మనకు ఎందుకులే అని అనుకుంటున్నారు నెటిజెన్స్.


మరింత సమాచారం తెలుసుకోండి: