బాహుబలి, బాహుబలి2, సాహో సినిమాలతో ప్రభాస్ రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఒకప్పుడు టాలీవుడ్ కు మాత్రమే పరిమితమైన ప్రభాస్ సినిమాల కోసం ఇప్పుడు బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలు కూడా ఎదురుచూస్తున్నాయి. మరో నాలుగు రోజుల్లో ప్రభాస్, శ్రధ్ధాకపూర్ జంటగా నటించిన సాహో సినిమా విడుదల కాబోతుంది. 350 కోట్ల రుపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమాకు విడుదలకు ముందే థియేట్రికల్ రైట్స్, శాటిలైట్, డిజిటల్ హక్కుల రూపంలో 450 కోట్ల రుపాయలు వచ్చాయి. 
 
సాహో సినిమా తరువాత ప్రభాస్ జాన్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. యువి క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సాహో ప్రమోషన్లలో ప్రభాస్ మాట్లాడుతూ సంవత్సరానికి కనీసం రెండు సినిమాలలో నటిస్తానని అదే సమయంలో భారీ చిత్రాలలో నటించనని చెప్పాడు. ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ప్రభాస్ మార్కెట్ ఇంత పెరిగిన తరువాత భారీ చిత్రాలలోనే నటిస్తే మంచిదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. భారీ చిత్రాలలో నటించనని ప్రభాస్ చెప్పటం పట్ల ప్రభాస్ ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. 


సాహో సినిమాకు హిట్ టాక్ వస్తే ప్రభాస్ సినిమాలపై భారీగా ఖర్చు పెట్టటానికి నిర్మాతలు కూడా వెనుకాడరు. మరి సాహో తరువాత ప్రభాస్ భారీ చిత్రాలలో నటిస్తాడో లేదో చూడాలి. సాహో సినిమా విషయానికి వస్తే ఈ సినిమా విజువల్ వండర్ లా ఉండబోతుందని తెలుస్తుంది. సినిమాలోని ట్విస్టులు ప్రేక్షకుల అంచనాలకు అందని విధంగా ఉంటాయని తెలుస్తుంది. 

 
ఈ సినిమాలో ప్రభాస్ రెండు పాత్రల్లో కనిపించబోతున్నాడని సమాచారం. సినిమాలో చివరి 40 నిమిషాలు సాహో అద్భుతంగా ఉండబోతుందని సమాచారం. ప్రపంచవ్యాప్తంగా మొదటిరోజు ఈ సినిమా 110 కోట్ల రుపాయలు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సాహో సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా జరుగుతున్నాయి. ఆగస్ట్ 30 వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: