వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడ్డ  యువ సామ్రాట్ నాగ చైతన్య  ఎట్టకేలకు  మజిలీ తో సూపర్ హిట్ కొట్టి సక్సెస్ ట్రాక్ ఎక్కాడు.  ఇక ఈ చిత్రం తరువాత ప్రస్తుతం నాగ  చైతన్య , విక్టరీ వెంకటేశ్  తో కలిసి 'వెంకీ మామ' అనే చిత్రంలో నటిస్తున్నాడు.  గత కొద్దీ నెలల నుండి రెగ్యులర్  షూటింగ్ ను జరుపుకుంటున్న ఈ చిత్రం తుది దశకు చేరుకుంది. నవంబర్ లో ఈ సినిమా ను ప్రేక్షకులముందుకు తీసుకరావడానికి  సన్నాహాలు చేస్తున్నారు. కామెడీ  ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి  జై లవ కుశ ఫేమ్  బాబీ దర్శకుడు. 




ఇక ఈసినిమా కాకుండా  ఇటీవల  శేఖర్ కమ్ములతో ఓ సినిమా చేయడానికి ఓకే చెప్పాడు నాగ చైతన్య .  ఇందులో సాయి పల్లవి హీరోయిన్ గా నటించనుండగా  సెప్టెంబర్ 5నుండి  రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది ఈ చిత్రం.  ఇక  తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో  డ్యాన్స్ బేస్డ్  లవ్ స్టోరీ గా  తెరకెక్కనున్న ఈ చిత్రంలో చైతన్య , సాయి పల్లవి లోకల్ స్లాంగ్ లో డైలాగులు చెప్పనున్నారు. కాగాసాయి పల్లవి ఇంతకుముందు ఫిదా లో కూడా తెలంగాణ  స్లాంగ్ లో డైలాగులు చెప్పగా నాగ చైతన్య  మొదటి సారి  ఈ స్లాంగ్ ను ట్రై చేస్తున్నాడు. 



నారాయణ దాస్ నారంగ్ ,  రామ్ మోహన్ రావు సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ లో విడుదలకానుంది. ఏఆర్ రహెమాన్ శిష్యుడు పవన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నాడని సమాచారం.  ఇక రేర్ కాంబినేషన్ లో రానున్న ఈ చిత్రం ఫై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: