రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ సాహో మరొక నాలుగురోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా సినిమా ఇండస్ట్రీలు మొత్తం సాహో ఫీవర్ తో హోరెత్తిపోతున్నాయి. ప్రభాస్ సరసన బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధ కపూర్ నటిస్తున్న ఈ సినిమాకు యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వం వహిస్తుండగా, ప్రభాస్ స్నేహతులు వంశీ మరియు ప్రమోద్, ఈ సినిమాను ఎంతో భారీ రేంజ్ లో నిర్మించడం జరిగింది . ఇక ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా, సెన్సార్ సభ్యులకు ఎంతో బాగా నచ్చిందని, సినిమా చూసిన తరువాత, 

ఇంత భారీ యాక్షన్ ఫిలిం మన ఇండియన్ మూవీ ఇండస్ట్రీ నుండి రావడం ఎంతో ఆనందంగా ఉందని వారు అభిప్రాయం వ్యక్తం చేసినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజయిన మూడు వీడియో సాంగ్స్ ప్రోమోలు యూట్యూబ్ లో అదరగొట్టే వ్యూస్ సంపాదించగా, కాసేపటి క్రితం ఈ సినిమాలోని 'బేబీ వోంట్ యు టెల్ మీ' అనే పల్లవితో సాగె నాలుగవ సాంగ్ వీడియో ప్రోమోని యూట్యూబ్ లో రిలీజ్ చేసింది యువి ప్రొడక్షన్స్ యూనిట్. శంకర్ మహదేవన్, అలీసా మెన్డోన్స, రవి మిశ్రలు సంయుక్తంగా ఆలపించిన ఈ పాటకు శంకర్ ఎహసాన్ లాయ్ సంగీతాన్ని అందించగా, మనోజ్ యాదవ్ సాహిత్యాన్ని సమకూర్చడం జరిగింది. ఫుల్ మెలోడియస్ గా రొమాంటిక్ లవ్ ట్రాక్ గా సాగిన ఈ సాంగ్ ను, 

విదేశాల్లోని అత్యద్భుతమైన లొకేషన్ తో పాటు, వండర్ఫుల్ గా క్రియేట్ చేసిన పలు సెట్స్ లో చిత్రీకరించడం జరిగింది. విజువల్ వండర్ గా చెప్పబడుతున్న ఈ సాంగ్ కు ప్రస్తుతం యూత్ నీరాజనాలు పడుతున్నారు. ఇక ముఖ్యంగా సాంగ్ లో ప్రభాస్, శ్రద్ధ జోడి అదరగొట్టారనే చెప్పాలి, ఇక వారిద్దరి కాస్ట్యూమ్స్ అయితే మరింత అత్యద్భుతంగా ఉన్నాయి. టోటల్ గా ఈ సాంగ్ హాలీవుడ్ రేంజ్ ఫీల్ తో ఎంతో స్టైలిష్ గా సాగుతూ ప్రస్తుతం యూట్యూబ్ లో మంచి వ్యూస్ తో దూసుకుపోతోంది. ఇక ఈ సాంగ్ రిలీజ్ తరువాత సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయని చెప్పాలి. మరి ఇప్పటికే తారా స్థాయిలో అంచనాలు ఏర్పరుచుకున్న సాహో, రేపు రిలీజ్ తరువాత ఆ అంచనాలను ఎంతవరకు అందుకుని సక్సెస్ సాధిస్తుందో తెలియాలంటే మరొక నాలుగురోజులు ఓపికపట్టాలి....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: