చిరంజీవి మెగా స్టార్ గా ఒక వెలుగు వెలుగుతున్న రోజులలో విజయశాంతి చిరంజీవి కాంబినేషన్ ఉంటే చాలు ఆ మూవీకి కాసుల వర్షం కురిసేది. ‘పసివాడిప్రాణం’ దగ్గర నుండి ‘గ్యాంగ్ లీడర్’ వరకు వీరిద్దరి కాంబినేషన్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు వచ్చాయి. అయితే ‘గ్యాంగ్ లీడర్’ షూటింగ్ సమయంలో విజయశాంతి చిరంజీవిల మధ్య ఏర్పడ్డ ఒక చిన్న భేదాభిప్రాయం వారిద్దరి మధ్య చాల గ్యాప్ ని పెంచింది. 

ఆ తరువాత రాజకీయాలలోకి వచ్చిన విజయశాంతి చిరంజీవిని టార్గెట్ చేస్తూ ఓపెన్ గానే చాల ఘాటైన విమర్శలు చేసింది. రాజకీయాలకు దూరమైన వీరిద్దరూ యూటర్న్ తీసుకుని తిరిగి సినిమాలలోకి వచ్చారు. ప్రస్తుతం ‘సరిలేరు నీకెవ్వరు’ తో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన విజయశాంతి అప్పుడే తన రెండవ సినిమాకు కూడ లైన్ క్లియర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. 

తెలుస్తున్న సమాచారం మేరకు కొరటాల శివ చిరంజీవితో త్వరలో ప్రారంభించబోతున్న మూవీలో కీలక పాత్ర కోసం విజయశాంతి ఎంపిక అయినట్లు టాక్. వాస్తవానికి ఈ పాత్ర కోసం అనుష్క నయనతారల పేర్లు పరిశీలించినా కొరటాల శివ విజయశాంతి పై మొగ్గు చూపండంతో మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్ సెట్ అవుతున్నట్లు సమాచారం. ఈ విషయమై చిరంజీవి అంగీకారం కూడ లభించడంతో త్వరలోనే ఈ విషయానికి సంబంధించిన అధికారిక ప్రకటన ఉంటుంది అని అంటున్నారు. 

అయితే ఈ మూవీలో నటించడానికి కూడ విజయశాంతి తన పారితోషికం బాగా డిమాండ్ చేసినా చిరంజీవి విజయశాంతిల కాంబినేషన్ కు ఉండే క్రేజ్ రీత్యా ఈ మూవీకి భారీ బిజినెస్ జరుగుతుందనే ఆలోచనలలో కొరటాల శివ విజయ శాంతి చెప్పిన అన్ని కండిషన్స్ కు ఒప్పుకున్నట్లు టాక్. ఈ మూవీ కథలో భారీగా మార్పులు జరిగిన నేపధ్యంలో ఈ మూవీని దసరా పండుగ రోజున ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: