అప్పట్లో 13 సంవత్సరాల క్రితం టాలీవుడ్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న విజయశాంతి అప్పట్లో ఉన్న స్టార్ హీరోలందరి పక్కన నటించడం జరిగింది. బాలకృష్ణతో చిరంజీవి తో సూపర్ డూపర్ హిట్లు అందుకున్న విజయశాంతి టాప్ హీరోయిన్ గా అప్పట్లో కొనసాగేది. అంతేకాకుండా ఒకపక్క కమర్షియల్ సినిమాలు చేస్తూ మరో పక్క లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా చేస్తూ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునేది. అంతేకాకుండా అప్పట్లో విజయశాంతి జాతీయ అవార్డు కూడా అందుకోవడం జరిగింది. ఇటువంటి తరుణంలో రాజకీయాల్లోకి వెళ్లిన విజయశాంతి తెలంగాణ రాష్ట్ర సాధనకై టిఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా పని చేసింది. అయితే ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చేరిన విజయశాంతి ఇటీవల 13 సంవత్సరాల తర్వాత మళ్లీ మేకప్ వేసుకుని సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న 'సరిలేరు నీకెవ్వరు' సినిమా తో రీ ఎంట్రీ ఇస్తున్న విజయశాంతి తాజాగా మెగా హీరోతో జోడి కట్టడానికి సిద్ధమైనట్లు ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి. విషయంలోకి వెళితే అది కూడా మెగాస్టార్ చిరంజీవి పక్కన. మేటర్ ఏమిటంటే మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సైరా సినిమా ముగించుకుని కొరటాల సినిమా కి రెడీ అవుతున్నారు. ఈ సినిమాలో చిరంజీవి డబల్ రోల్ లో నటిస్తున్నట్లు సమాచారం. దీంతో రెండు పాత్రలలో కనబడే చిరంజీవి ఒక పాత్రలో ఆయన పక్కన పెయిర్ గా విజయశాంతి కనిపించబోతున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వినబడుతున్నాయి.
అయితే అధికారికంగా ఈ వార్త ఎక్కడ బయటికి రాలేదు. ఒకవేళ ఈ ఇద్దరి పెయిర్ కనుక వాస్తవమైతే ఖచ్చితంగా మెగా అభిమానులకు పండగే అని అంటున్నారు సినిమా ఇండస్ట్రీకి చెందినవారు. ఒకప్పటి వీరిద్దరి జోడి వెండితెరపై అనేక అద్భుతాలు చేసి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అనేక రికార్డులు తిరగ రాసిన సందర్భాలు ఉన్నాయి. ఇటువంటి క్రమంలో మరొకసారి చిరంజీవితో విజయశాంతి నటించడం గ్యారెంటీ అయితే కచ్చితంగా కొరటాల శివ సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ లో మ్యాజిక్ చేయడం కన్ఫామ్ అని అంటున్నారు.