మినిమం గ్యారెంటీ హీరో  గోపిచంద్  ఇటీవల వరుస పరాజయాలతో సతమవుతున్నాడు.  ప్రస్తుతం ఈ హీరో ,తమిళ డైరెక్టర్ తిరు తో 'చాణక్య' అనే  సినిమా చేస్తున్నాడు.  హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం లో  మెహ్రీన్ కథానాయికగా నటిస్తుండగా బాలీవుడ్  బ్యూటీ  జరీన్ ఖాన్ ముఖ్య పాత్రలో నటిస్తుంది.   ఈ చిత్రం యొక్క షూటింగ్ తుది దశకు చేరుకుంది.  అందులో భాగంగా ఇంకా ఒక్క సాంగ్ చిత్రీకరణే మిగిలివుంది. ఈసాంగ్  షూటింగ్ ఇటలీ లోని  మిలాన్ లో జరుగనుంది. రేపటి నుండి గోపిచంద్ ఈ షూటింగ్ లో  జాయిన్ కానున్నాడు.   ఏకే  ఎంటర్టైన్మెంట్స్  పతాకం ఫై  అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈచిత్రానికి  పడి పడి లేచె మనసు ఫేమ్ విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నాడు.   గోపిచంద్ కెరీర్ లోనే   అత్యధిక బడ్జెట్ తో  తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా  అక్టోబర్ 4 న విడుదలచేయనున్నారని తెలుస్తుంది. 





ఇక అక్టోబర్ 2న మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న  పీరియాడికల్ మూవీ సైరా విడుదలకానుందని తెలిసిందే.  ఇప్పటికే ఈ సినిమా ఫై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. మరి ఇలాంటి సమయం లో   ఈ సినిమా కు పోటీ గా చాణక్య  ను విడుదల చేస్తూ రిస్క్ చేస్తున్నాడు గోపిచంద్.  మరి నిజంగానే  ఈ చిత్రం అక్టోబర్ 4న విడుదలవుతుందా లేక  సైరా తో పోటీ ఎందుకని   వాయిదా వేస్తారో చూడాలి.  త్వరలోనే చాణక్య విడుదల తేదీ ఫై క్లారిటీ రానుంది. ఇక  ఈసినిమా తరువాత  గోపిచంద్  నూతన దర్శకుడు బిను సుబ్రమణ్యం  డైరెక్షన్ లో నటించనున్నాడు.  ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించనున్న ఈచిత్రం ఇటీవలే లాంచ్ అయ్యింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: