బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ సీజన్ 3 ఐదు వారాలు పూర్తి చేసుకుని ఆరో వారంలోకి అడుగుపెట్టింది. ఆసక్తి కరంగా సాగుతున్న బిగ్‌బాస్‌ గేమ్ షోకు టీఆర్పీ రేటింగులు భారీ స్థాయిలో లేకపోయినా.. విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ఇప్పటికే, మొత్తం ఐదుగురు సభ్యులు బిగ్ బాస్ ఇంటి నుండి ఎలిమినేట్ అయ్యారు. పోయిన ఐదువారాల్లో హేమ, జాఫ‌ర్‌, మొదటి వైల్డ్-కార్డ్ ఎంట్రీ తమన్నా కూడా ఎలిమినేట్ అయిపోయింది. ఆ త‌ర్వాత రోహిణి, అషు ఎలిమినేట్ అయ్యారు. ఒక్కొక్క హౌస్ మేట్ బయటకు వెళ్ళేకొద్దీ మిగతా హౌస్ మేట్స్ పై ప్రెజర్ పెరుగుతుంది..పోటీ కూడా తీవ్రమవుతుంది.  


బిగ్ బాస్ హౌస్ మొత్తం పదిహేను మందితో ప్రారంభమైన ఈ సీజన్లో.. ప్ర‌స్తుతం 11 మంది స‌భ్యులు ఉన్నారు. పునర్నవి, వితిక, వరుణ్, హిమజ, శ్రీముఖి, రవికృష్ణ, అలీ రెజా, శివజ్యోతి,  రాహుల్, మహేష్, బాబా భాస్క‌ర్ ఇంట్లో కొన‌సాగుతున్నారు. ఆరోవారం కొన‌సాగుతున్న బిగ్‌బాస్ హౌస్‌లోకి మ‌రో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంద‌ని విసృతంగా సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతుంది. ఈ క్ర‌మంలోనే ఈషా రెబ్బ, శ్రద్ధా దాస్.. ఇద్ద‌రిలో ఒక‌రు ఈ వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుంద‌ని అంటున్నారు.  
 
వాస్త‌వానికి బిగ్‌బాస్ నిర్వాహ‌కులు వారిద్ద‌రినీ సంప్ర‌దించిన‌ట్టు స‌మాచారం. మొదటి వారం ఎలిమినేషన్ సమయంలోనే ముందు శ్రద్ధా దాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందని భావించారు. కానీ, అనుకోకుండా తమన్నా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి రెండు వారాల్లో ఎలిమినేట్ అయింది. ఇక ప్ర‌స్తుతం ఇద్ద‌రు హాట్ భామ‌లు.. శ్రద్ధ దాస్, ఈషా రెబ్బల‌లో ఎవ‌రో ఒక‌రు బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌నున్నార‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఏం ? జ‌రుగుతుందో ఈ వీకెండ్ వ‌ర‌కు వేచి చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: