దివంగత దిగ్గజ నటి మరియు అతిలోక సుందరిగా పేరుగాంచిన శ్రీదేవి గారి తనయ జాన్వీ కపూర్, ఇటీవల ధఢక్ అనే సినిమాతో బాలీవుడ్ చిత్ర సీమకు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే నటించిన తొలి సినిమానే సక్సెస్ అయి, నటిగా ఆమెకు మంచి పేరు, గుర్తింపు తీసుకువచ్చింది. ఇక ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్న జాన్వికి సంబంధించి గత కొద్దిరోజులుగా కొన్ని రూమర్లు ప్రచారం అవుతున్నాయి. ముందుగా ఆమె టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో హీరోయిన్ గా నటించే అవకాశాలు వచ్చినప్పటికీ, ఆమెకు సౌత్ లో సినిమాలు చేసే ఇంటరెస్ట్ లేకనే కావాలని వాటిని వదులుకుందని, 

ఆమె ప్రిఫరెన్సు కేవలం బాలీవుడ్ కె నంటూ కొన్ని మీడియా మాధ్యమాల్లో వార్తలు ప్రచారం అయ్యాయి. అంతేకాదు, పూరి జగన్నాథ్ అతి త్వరలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కించనున్న సినిమాలో కూడా జాన్వీ ని తీసుకోవాలని భావించారు. అయితే ఆ ఆఫర్ ని కూడా ఆమె కావాలనే రిజెక్ట్ చేసింది అంటూ కూడా వార్తలు రావడం జరిగింది. ఇక నేడు ఈ పుకార్లన్నిటికీ చెక్ పెడుతూ, జాన్వీ  తండ్రి బోనీ కపూర్ స్వయంగా రంగంలోకి దిగి, ఒక పత్రికా ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. నిజానికి శ్రీదేవి గారు బాలీవుడ్ తో పాటుగా సౌత్ సినిమాలు కూడా చాలానే చేసారనే విషయం అందరికి తెలుసునని, మరీ ముఖ్యంగా తెలుగులో అప్పట్లో ఆమె నటించిన ఎన్నో సినిమాలు సూపర్ డూపర్ హిట్స్ గా నిలిచి ఆమెకు ఎనలేని కీర్తిప్రతిష్టలు మేము ఎప్పటికీ మరిచిపోలేమని అన్నారు. 

ఇక టాలీవుడ్ నటులైన కృష్ణ గారు, చిరంజీవి గారుతో పాటుగా ఇతర నటులతో కూడా తమకు మంచి అనుబంధం ఉందని, అలానే సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే తమకు ప్రత్యేక గౌరవం అని అయన చెప్పుకొచ్చారు. అటువంటపుడు జాన్వికి నిజంగా అంతగొప్ప స్టార్స్ తో నటించే అవకాశం వస్తే తాను ఎందుకు వదులుకుంటుంది చెప్పండి. కాబట్టి మీడియా మాధ్యమాల్లో ఈ విషయమై వచ్చినవన్నీ కూడా ఒట్టి పుకార్లేనని ఆయన కొట్టిపారేశారు. సౌత్ నుండి ఎప్పుడు ఎటువంటి అవకాశం వచ్చినా జాన్వీ చేయడానికి సిద్ధం అని, కనుక ఇకపై ఇటువంటి నెగటివ్ వార్తలు రాయకండి అంటూ అయన ఆ ప్రకటనలో కోరడం జరిగింది.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: