భారతీయ చలన చిత్ర రంగంలో అతిలోక సుందరిగా పేరు తెచ్చుకున్న నటి శ్రీదేవి. తెలుగు లో ఆమె టాప్ హీరోయిన్లతో పోటీ పడి నెంబర్ వన్ హీరోయిన్ గా వెలిగిపోయింది. అదే సమయంలో ఆమె బాలీవుడ్ లోకి వెళ్లి అక్కడ కూడా నెంబర్ వన్ స్థానాన్ని సంపాదించింది. బాలీవుడ్ లో నెంబర్ వన్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి జాన్వి, ఖుషీ కపూర్ లు జన్మించారు. అయితే పిల్లల ఆలనా పాలనా చూసుకోవడానికి చాలా కాలం సినీ పరిశ్రమకు దూరంగా ఉంటూ వచ్చింది శ్రీదేవి. అయితే ఇంగ్లీష్..వింగ్లీష్ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.
తన కూతురు జాన్విని హీరోయిన్ గా తీర్చిదిద్దాలని ఎంతో తాపత్రయ పడింది. ఆ సమయంలోనే ధడక్ సినిమాలో జాన్వీ హీరోయిన్ పరిచయం అయ్యింది. కానీ విధి మరోలా ఈ కుటుంబాన్ని ఆవేదనకు గురిచేసింది. దుబాయ్ లో నటి శ్రీదేవి ప్రమాద వశాత్తు టబ్ లో పడి శ్వాస విడిచారు. ఆమె మరణ వార్త విని యావత్ భారత సినీ అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇక జాన్వి నటించిన ‘ధడక్’ మంచి హిట్ అయ్యింది. ఈ మద్య జాన్వీ కపూర్ టాలీవుడ్లో ఎంట్రీ ఇస్తుందని ఎంతో కాలంగా రూమర్స్ వస్తున్నాయి. రాంచరణ్, మహేష్ బాబు సరసన జాన్వీ నటించబోతుందని..అలాగే పూరి, అర్జున్ రెడ్డి మూవీలో కన్ఫామ్ అయ్యిందని రక రకాల వార్తలు వచ్చాయి.
అయితే బాలీవుడ్ లో జాన్వీకి సెట్ కాక దక్షిణ భారత సినిమాల్లో వెళ్తున్నట్లు వార్తలు రావడంతో ఆమె తండ్రి బోనీ కపూర్ స్పందించారు. జాన్వీకి కానీ.. తమ కుటుంబానికి కానీ.. దక్షిణ భారత సినిమాలంటే ఎంతో ప్రేమ అని ఆయన తెలిపారు. జాన్వీకి బాలీవుడ్లో నటించడమే ఇష్టమని.. అందుకే తను దక్షిణ భారత సినిమాల్లో నటించేందుకు అంగీకరించడం లేదంటూ.. వాళ్లు వార్తలు సృష్టించారు.
ఇక శ్రీదేవి సౌత్ ఇండియా సినిమాల ద్వారా ఎంత పాప్ లర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. చిరంజీవి, కృష్ట వంటి వారితో మాకు సత్సంబంధాలు ఉన్నాయి. మహేశ్ బాబు, మేము పరస్పరం ఎంతో గౌరవించుకుంటాము. మంచి కథ దొరికితే జాన్వీ సౌతిండియాలో సినిమా చేసేందుకు జాన్వీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని అన్నారు. సౌతిండియాలో నటించడం తనకు ఇష్టం లేదు అన్న వార్తలు పూర్తిగా నిరాధారమైనవి బోనీ కపూర్ స్పష్టం చేశారు.