యువ నటుడు మరియు రచయితైన అడివి శేష్ హీరోగా రూపొందిన లేటెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ ఎవరు. కొత్త దర్శకుడు వెంకట్ రాంజీ దర్శకుడిగా పరిచయం అయిన ఈ సినిమా, మొన్న ఆగష్టు 15వ తేదీన స్వతంత్ర దినోత్సవ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. శేష్ ప్రధాన పాత్రలో రూపొందిన ఈ సినిమాలో రెజీనా, నవీన్ చంద్ర, పవిత్ర లోకేష్, మురళి శర్మ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించడం జరిగింది.  

ఆద్యంతం ప్రేక్షకుడిని థ్రిల్ చేసే ట్విస్టులతో ఆకట్టుకునే కథ మరియు కథనాలతో రూపొందిన ఈ సినిమా, ప్రేక్షక నాడిని పట్టడంలో సఫలమయ్యింది. ఇకపోతే తొలిరోజు నుండే మంచి సక్సెస్ఫుల్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమా, ఇప్పటికీ చాలా చోట్ల మంచి కలెక్షన్స్ తో ముందుకు సాగుతోంది. ఇక ఈ సినిమా విడుదలై నేటితో 11 రోజులు గడిచింది, ఈ 11 రోజుల్లో ఇప్పటివరకు మొత్తం రూ.9.70 కోట్ల కలెక్షన్ ని ఈ సినిమా రాబట్టినట్లు ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నారు. అయితే ఈ సినిమాకు జరిగిన బిజినెస్ రూ.9.10 కుట్లు అని, 

ఆపైన ఇకపై వచ్చేవన్నీ కూడా లాభాలేనని వారు చెప్తున్న లెక్కలను బట్టి అర్ధం అవుతోంది. ఇక ఈ సినిమాపై ప్రేక్షకులు సహా కొందరు సినిమా ప్రముఖులు సైతం పొగడ్తలు కురిపించిన విషయం తెలిసిందే. ఇటీవల స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అలానే నిన్న సూపర్ స్టార్ మహేష్ బాబులు ఈ సినిమాను చూసి, ఎంతో అద్భుతంగా ఉందంటూ యూనిట్ ని ప్రశంసించడం జరిగింది. మరి ఇప్పటికే ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అయిన ఈ సినిమా, రాబోయే రోజుల్లో ఇంకెంత మేర కలెక్ట్ చేస్తుందో తెలియాలంటే మాత్రం మరికొద్దిరోజులు ఓపికపట్టాల్సిందే.  


మరింత సమాచారం తెలుసుకోండి: