మాస్ రాజా రవితేజ ప్రస్తుతం ప్లాపుల్లో వున్నాడు. అయితే ఇలాంటి సమయంలో కూడా రిస్క్ చేస్తున్నాడు. ఈ సారి అయినా స్టార్ డైరెక్టర్ తో కాకుండా.. ప్లాప్ డైరెక్టర్ తో సినిమా చేయడానికి ఆయన ఓకే చెప్పాడని సమాచారం. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరేంటే సుధీర్ వర్మ.. స్వామి రారాతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన సుధీర్ మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. అయితే ఆ తరువాత తీసిన సినిమాలు అన్ని ఫెయిల్ అయ్యాయి. ఇటీవల శర్వానంద్ తో తీసిన గ్యాంగ్ స్టర్ డ్రామా 'రణరంగం' కూడా ప్లాప్ లిస్ట్ లో చేరిపోయింది. అయితే ఈ సినిమానే రవితేజ తో చేయాల్సింది కానీ ఆ సమయం లో రవితేజ వేరే సినిమాలతో బిజీ గా ఉండడంతో కుదరలేదని సుధీర్ వర్మే ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో చెప్పాడు. ఎట్టకేలకు ఇప్పుడు రవితేజ ఈ డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చాడట.
అయితే ఈ సారి సొంత కథతో కాకుండా రీమేక్ ను నమ్ముకున్నాడు సుధీర్ వర్మ. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి , మాధవన్ హీరోలుగా నటించిన సూపర్ హిట్ కోలీవుడ్ మూవీ 'విక్రమ్ వేద;'ను సుధీర్ తెలుగులో రీమేక్ చేయనున్నాడు. ఈ రీమేక్ లో రవితేజ , విజయ్ సేతుపతి పాత్రలో నటించనున్నాడట. మరో హీరోను ఎంపిక చేయాల్సివుంది. ఒరిజినల్ వెర్షన్ ను నిర్మించిన వై నాట్ స్టూడియోస్ ఈ రీమేక్ ను కూడా నిర్మించనుంది. త్వరలోనే ఈరీమేక్ గురించి అధికారక ప్రకటన వెలుబడనుంది. ఇక రవితేజ ప్రస్తుతం 'డిస్కోరాజా' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా ను పూర్తి చేసి, విక్రమ్ వేద రీమేక్ ను సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నాడు.