ప్రభాస్ బాహుబలి తరువాత తన స్థాయిని అమాంతం పెంచేసుకున్నాడు. బాహుబలి సీరీస్ లోని రెండు సినిమాలు భారీ స్థాయిలో హిట్ కొట్టాయి. ఇలా భారీ విజయం సాధించడంతో.. సాహు సినిమాకు క్రేజ్ పెరిగింది. ఈ సినిమా ప్రచార చిత్రాలు సినిమాను ప్లస్ అయ్యాయి. పైగా ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ పై ఎవరూ చూడని విధంగా యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని చెప్పడంతో ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.
హాలీవుడ్ రేంజ్ లో సినిమా ఉండబోతుంది. అందులో నో డౌట్. ఇప్పటికే సినిమాకు పాజిటివ్ వైబ్ క్రియేట్ కావడంతో అంచనాలు పెరిగాయి. సెన్సార్ రిపోర్ట్ కూడా పాజిటివ్ గా వస్తోంది. ఇక మిగిలింది ఆగష్టు 30న రిలీజ్ కావడమే. ఆరోజు కోసం ప్రతి ఒకరు ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.
మరో రెండు రోజుల్లో సినిమా థియేటర్స్ లో సందడి చేయబోతున్నది. ఈ సినిమా రియల్ గా థియేటర్లో ఎలా ఉంటుంది అనే దానిపైనే ఇప్పుడు అందరి చూపులు ఉన్నాయి. ఇదిలా ఉంటె, ఈ సినిమాను బట్టి నెక్స్ట్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జాన్ సినిమా ఆధారపడి ఉంటుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి చాలా వరకు షూటింగ్ కంప్లీట్ అయ్యింది.
సాహో పూర్తయ్యాక ప్రభాస్ జాన్ పై దృష్టి పెడతారు. వీలైనంత త్వరగా సినిమా షూటింగ్ కంప్లీట్ చేయాలనీ లక్ష్యంగా పెట్టుకున్నారు. దీన్ని మాములుగా చిన్న బడ్జెట్ అనుకున్నా.. దీనికి కూడా బడ్జెట్ భారీగా అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. పీరియాడికల్ స్టోరీ కావడంతో అంచనాలు పెరిగాయి. పూజా హెగ్డే హీరోయిన్ గా చేస్తున్నది.
ఇక ఇందులో కొన్ని సన్నీవేశాలు ఇండియన్ స్క్రీన్ పై చూడని సన్నివేశాలు కొన్ని ఉన్నాయని.. వాటిని రాధాకృష్ణ చక్కగా చూపిస్తున్నారని ప్రభాస్ చెప్తున్నాడు. ఇది పాన్ ఇండియా సినిమా కాకపోయినా బాలీవుడ్ లో తప్పకుండా సినిమా రిలీజ్ అవుతుంది. కాబట్టి సినిమాపై అంచనాలు పెరిగాయి.