గత ఏడాది 'చల్ మోహన్ రంగ , శ్రీనివాస కళ్యాణం' చిత్రాలతో ప్రేక్షకులముందుకు వచ్చిన యంగ్ హీరో నితిన్ కు ఈ రెండు కూడా విజయాలను అందించలేకపోయాయి.  అయితే ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని 'ఛలో' తో విజయాన్ని అందుకున్న డైరెక్టర్ వెంకీ కుడుములతో  'భీష్మ' అనే చిత్రాన్ని చేస్తున్నాడు నితిన్. ఇటీవలే ఈ చిత్రం  యొక్క షూటింగ్  స్టార్ట్ కాగా.. ప్రస్తుతం  రెండవ షెడ్యూల్ షూటింగ్  జరుపుకుంటుంది. ఈషెడ్యూల్  గతంలో నితిన్ నటించిన సూపర్ హిట్ మూవీ అ ఆ కోసం వేసిన ఇంటి సెట్ లో జరుగుతుంది. అ ఆ సినిమాకి  వెంకీ కుడుముల అసిస్టెంట్  డైరెక్టర్ గా పనిచేయగా ఇప్పుడు అదే సెట్ లో డైరెక్టర్ గా పనిచేస్తుండడం విశేషం. మరి భీష్మ కు కూడా అ ఆసెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతుందో లేదో చూడాలి. 




ఈ చిత్రంలో   కన్నడ బ్యూటీ రష్మిక కథానాయికగా నటిస్తుండగా  ఛలో ఫేమ్ మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు.  సితార ఎంటర్టైన్మెంట్స్ ఈచిత్రాన్ని నిర్మిస్తుంది. ఇక ఈ సినిమాతో పాటు నితిన్ ప్రస్తుతం 'తొలిప్రేమ' ఫేమ్ వెంకీ అట్లూరి  డైరెక్షన్ లో 'రంగే దే' సినిమాలో నటిస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో  కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తుంది. ఈ రెండు కాకుండా 'సాహసం' ఫేమ్ చంద్రశేఖర్ యేలేటి తో కూడా ఓ సినిమా చేయనున్నాడు నితిన్.  భవ్య క్రియేషన్స్ నిర్మించనున్న ఈ చిత్రం త్వరలోనే ప్రారంభం కానుంది.  యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో  రకుల్ ప్రీత్ సింగ్ , మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్  హీరోయిన్లుగా నటించనున్నారు. కాగా ప్రియా ప్రకాష్ కు తెలుగులో ఇదే మొదటి సినిమా..


మరింత సమాచారం తెలుసుకోండి: