ప్రస్తుతం ప్రభాస్ ‘సాహో’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో చాలా చురుగ్గా పాల్గొంటున్నారు. బాహుబలి తర్వాత ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ క్రేజ్ విస్తరించడంతో..ఎప్పుడు సాహో సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో ఎక్కడ చూసిన ప్రభాస్ గురించి వార్తలు వినబడుతున్నాయి. ముఖ్యంగా ప్రభాస్ ప్రమోషన్ కార్యక్రమాల్లో 'సాహో' సినిమా గురించి మరియు పర్సనల్ లైఫ్ గురించి చెబుతున్న విషయాలు అటు ఎలక్ట్రానిక్ మీడియాలో ఇటు సోషల్ మీడియాలోనూ...చాలా వైరల్ అవుతున్నాయి.


ఇటువంటి నేపథ్యంలో ప్రభాస్ నటించిన సాహో సినిమా గురించి ఒక సంచలనకరమైన వార్త ప్రభాస్ చెప్పుకొచ్చారు. విషయంలోకి వెళితే ఇటీవల ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ఓ మీడియా చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ మాట్లాడుతూ...అన్నీ కుదిరితే తప్పకుండా  ‘సాహో’కి సీక్వెల్‌ ఉంటుంది. కానీ, వెంటనే ఉండదు. అది `సాహో` రిజ‌ల్ట్‌పై ఆధార‌ప‌డి ఉంది. 'సాహో' కి వ‌చ్చిన రెస్పాన్స్ చూసి సీక్వెల్ విష‌యాన్ని ఆలోచిస్తాం. మధ్యలో రెండు మూడు చిన్న సినిమాలు చేసి ఆ తర్వాత చేస్తా. అప్పుడు కూడా సీక్వెల్‌తో పాటు మరో సినిమా ప్యారలల్‌గా చేస్తా అని చెప్పుకొచ్చారు.


సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సాహో' సినిమాని ప్రభాస్ స్నేహితులు యు.వి.క్రియేషన్స్ సంస్థకి చెందిన వారు వంశీ, ప్రమోద్, విక్రమ్ నిర్మించారు. ఈ సినిమాలో ప్రభాస్ పక్కన హీరోయిన్ గా శ్రద్ధా కపూర్ నటించిన బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటులు జాకీష్రాఫ్, మందిరాబేడీ, నీల్ నీతేశ్ ముఖ్, అరుణ్ విజయ్, చుంకీ పాండే తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రభాస్ కెరియర్ లోనే దాదాపు 350 కోట్ల భారీ బడ్జెట్ తో ‘సాహో’ సినిమా నిర్మాణం జరిగింది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 30వ తారీకున విడుదల కానుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: