రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో సినిమాపై ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రజల్లో విపరీతమైన అంచనాలు నెలకొని ఉండడంతోపాటు ఎప్పుడెప్పుడు సినిమాని థియేటర్స్ లో చూస్తామా అనే ఆసక్తి వారిలో మరింతగా పెరిగిపోతోంది. ఇక ఇప్పటికే సినిమాపై పలు మీడియా మాధ్యమాల్లో కొన్ని రివ్యూస్ ప్రచారం అవుతున్నాయి. అందులో ఎక్కువశాతం మంది సినిమా ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్ గా అదరగొట్టిందని చెప్తుంటే, మరికొందరు మాత్రం సెకండ్ హాఫ్ లో కొంత స్పీడ్ తగ్గిందని, అయినప్పటికీ ఓవర్ అల్ గా బాగుందంటూ పలు విధాలుగా వార్తలు ప్రచారం చేస్తున్నారు. 

అయితే వాటన్నిటికి చెక్ పెడుతూ, ప్రముఖ సినిమా క్రిటిక్, ఉమైర్ సందు సాహో మూవీపై ఫస్ట్ రివ్యూని తన సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ లో కాసేపటి క్రితం పోస్ట్ చేయడం జరిగింది. సాహో నిజంగా ఇండియాలోనే ఇప్పటివరకు రాని అతి పెద్ద యాక్షన్ సినిమా అని ఆయన అన్నారు. ఇక సినిమాలో యాక్షన్ , ఛేజింగ్ సీన్స్ , మ్యూజిక్, రొమాన్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇలా అన్ని విభాగాల్లోనూ సాహో అదరగొట్టిందని అన్నారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ మరియు శ్రద్దల జోడి వండర్ఫుల్ గా ఉందని, ఇక ఈ సినిమా చూసిన తరువాత ప్రభాస్ కు ఇండియా రేంజ్ లో మరింతగా పేరుప్రఖ్యాతలు రావడం ఖాయమని ఆయన తన పోస్ట్ లో తెలిపారు. 

ఇందులో బ్యాడ్ బాయ్ సాంగ్ లో ప్రత్యేకంగా నటించిన బాలీవుడ్ హీరోయిన్ జాక్వలీన్ ఫెర్నాండజ్ తో కలిసి దిగిన ఫోటోను ఆయన తన రివ్యూ ని పోస్ట్ చేస్తూ పెట్టారు. అలానే ఓవర్ ఆల్ గా ఈ సినిమాకు తాను 4 స్టార్ రేటింగ్ ఇస్తున్నాని కూడా తెలిపారు. ఇక ఉమైర్ ఇచ్చిన ఫుల్ పాజిటివ్ రివ్యూ తో, డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. రేపు సాహోతో ఇప్పటివరకు ఉన్న అన్ని రికారులు కూడా బద్దలవడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: