టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మాతగా అత్యంత భారీ ఖర్చుతో రూపొందుతున్న లేటెస్ట్ మూవీ సైరా నరసింహారెడ్డి. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు, తమన్నా తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. రాయలసీమ ప్రాంతానికి చెందిన రేనాటి వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాథ ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాపై టాలీవుడ్ సహా దేశవ్యాప్తంగా మిగతా సినిమా ఇండస్ట్రీల్లోని ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలున్నాయి. 

ఇప్పటికే ఈ సినిమా నుండి యూట్యూబ్ లో రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్ కు మెగా ఫ్యాన్స్, ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించడం జరిగింది. ఇక ఇటీవల ఈ సినిమా టీజర్ ను ముంబైలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో రిలీజ్ చేసింది సినిమా యూనిట్. అయితే ఆ సందర్భంగా అక్కడి మీడియాతో హీరో చిరంజీవి, నిర్మాత చరణ్ ముచ్చటించడం జరిగింది. కొద్దిరోజులుగా ఈ సినిమాలో అనుష్క నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి, అది నిజమేనా అని విలేఖరి అడిగిన ప్రశ్నకు మెగాస్టార్ సమాధానమిస్తూ, నిజమేనని అన్నారు. తమ సినిమాలో ఎంతో కీలకమైన వీరనారి ఝాన్సీ లక్ష్మి బాయి పాత్రలో అనుష్క గారు నటించడం జరిగింది. సినిమా బిగినింగ్ లో నరసింహారెడ్డి పాత్రను పరిచయం చేసే విధంగా ఆమె పాత్ర ఉంటుందని అన్నారు. 

అయితే ఆమె పాత్రపై నేడు కొన్ని మీడియా మాధ్యమాల్లో ఒక వార్త ప్రచారం అవుతోంది. నిజానికి సినిమాలో నిడివి పరంగా ఆమెది చిన్న పాత్రే అయినప్పటికీ, ఆ పాత్ర కీలకమైనదని మరియు దాని యొక్క పరిధి ఎంతో గొప్పదని, రేపు సినిమా పూర్తి అయి బయటకు వచ్చిన తరువాత, ప్రేక్షకులు ఎక్కువగా మాట్లాడుకునే ముఖ్యమైన పాత్రల్లో ఝాన్సీ లక్ష్మి బాయి పాత్ర ఖచ్చితంగా ఉంటుందని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్నట్లు సైరా సినిమాలో అనుష్క పాత్ర ఎంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో తెలియాలంటే ఆ సినిమా రిలీజ్ వరకు వేచిచూడాల్సిందే.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: