చిరంజీవి తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ గేమ్ మహేష్-పవన్ మధ్య నువ్వా నేనా అన్నట్టు గా సాగింది. అయితే అనూహ్యంగా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రావడం తో ఇండస్ట్రీలో సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. వీరిద్దరి సినిమాలు అంటే టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం పండగ వాతావరణం ఉంటుంది. అలాగే వీరికి సంబంధించిన సినిమా విడుదల అవుతుందంటే చాలు ఇద్దరు హీరోల అభిమానులు ఎప్పుడెప్పుడా అని పడిగాపులు కాస్తుంటారు సినిమా హాల్ దగ్గర. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వీరిద్దరికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మరో హీరోకి ఉండదు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్-మహేష్ బాబు ఒకే వేదికపై కనబడునట్లు ఫిలింనగర్ లో వార్తలు వినబడుతున్నాయి.


ఇక అసలు మేటర్ లోకి వెళ్తే తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భాంగా సెప్టెంబర్ 8న రజతోత్సవ వేడుకలు నిర్వహించనున్నారు. దీనికి కర్టెన్ రైజింగ్ ప్రెస్ మీట్ ని కూడా టి సుబ్బిరామిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. రాజశేఖర్, సి కళ్యాణ్, సంపూర్ణేష్ బాబు, సందీప్ కిషన్ లాంటి ప్రముఖులు ఈ ప్రెస్ మీట్ కు హాజరయ్యారు. సెప్టెంబర్ 8న జరిగే ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథులుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు హాజరు కాబోతున్నట్లు టాక్.


సినీవర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే నిర్వాహకులు పవన్ కళ్యాణ్, మహేష్ బాబుని కలసి వారిని ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఇద్దరూ కలిసి ఈ వేడుకకు హాజరైతే కచ్చితంగా ఈ వేడుక టాలీవుడ్ హిస్టరీ లోనే ఒక చరిత్రాత్మకమైన వేడుకగా నిలిచిపోతుందని అంటున్నారు ఇండస్ట్రీకి చెందిన వారు. మొత్తంమీద చూసుకుంటే ఇప్పుడిప్పుడే టాప్ హీరోలు ఒక సినిమా హీరో ఫంక్షన్లకు ఒకరు వెళ్తున్న క్రమంలో...పవన్ కళ్యాణ్, మహేష్ బాబు కలిసి ఈ వేడుకకు హాజరు కావడం అంటే ఇండస్ట్రీలో హీరోల మధ్య మంచి వాతావరణం ఉంది అనే మెసేజ్ బయటకు వెళుతుందని దీనిద్వారా అభిమానుల మధ్య గొడవలు ఉండాలని చాలామంది సినిమా ఇండస్ట్రీకి చెందిన పెద్దలు అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: