టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్ మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి కాంట్రవర్సీలు లేకుండా ముందుకు సాగుతున్నాడు.  ఒక సినిమా కోసం ఏకంగా ఐదు సంవత్సరాలు, తన పెళ్లి విషయాన్ని కూడా పక్కబెట్టి ఎంతో డెడికేషన్ తో డైరెక్టర్ తో ప్రయాణం చేయడం నిజంగా ఎంతో గొప్ప విషయం అని ప్రభాస్ గురించి ఎన్నో సార్లు దర్శకధీరుడు రాజమౌళి చెబుతుంటారు.  అయితే బాహుబలి లాంటి గొప్ప సినిమా జాతీయ స్థాయిలో అప్పటి వరకు ఉన్న రికార్డులను బద్దలు కొట్టిన సినిమా, ఈ సినిమాలో హీరోగా నటించిన ప్రభాస్ కి జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు వచ్చినా కూడా ఎలాంటి గర్వానికి పోకుండా చాలా కూల్ గా ప్రశాంతంగా ఉంటారు. 

టాలీవుడ్ లో ఏ చిన్న హీరో అయినా పిలిస్తే పలుకుతాడు..ఈవెంట్స్ కి వెళ్తుంటారు, వారికి ఎంతో ఎంకరేజ్ ఇస్తుంటారు.  అలాంటి ప్రభాస్ ప్రస్తుతం ‘సాహెూ’మూవీ ప్రమోషన్  బిజీగా ఉన్నారు. సాహో రిలీజ్ సమయం దగ్గరపడే కొద్దీ అభిమానుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ కలెక్షన్లపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలీవుడ్ లో ఇప్పటి వరకు ఖాన్స్ త్రయం నడుస్తుంది..ఈ నేపథ్యంలో అమరేంద్ర బాహుబలిగా చెరగని ముద్ర వేశాడు. ‘సాహెూ’ మూవీతో ఆ క్రేజ్ మరింతగా ఎక్కువవుతోంది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ మాట్లాడుతున్న సందర్బంగా  బాలీవుడ్ ఖాన్స్ ని మించిపోయిన క్రేజ్ మీకు వస్తుంది అన్న ప్రశ్నకు ఎంతో సున్నితంగా అద్భుతమైన సమాధానం ఇచ్చాడు.  నిజంగా ఈ సమాధానం విన్నవారు అందుకే ప్రభాస్ ని అంతగా ప్రేమిస్తారని అంటారు. తనకు ఎదురైన ప్రశ్నకు సమాధానం ఇస్తూ..టీమ్ ఇండియాలో సచిన్ టెండుల్కర్ కి ఎంత గొప్ప స్థానం ఉందో తెలిసిందే. అయితే ఆయన తర్వాత ఎవరైనా వచ్చి రెండువందల రన్స్ చేసినంత మాత్రాన  సచిన్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందా..ఆయన మార్క్ పోతుందా..ఎవరి గొప్పతనం వారిది.  నేను కూడా అంతే.. ఇక్కడ ఖాన్స్ ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించారు.. వాళ్ళని నేనెలా మించిపోతాను అని ప్రభాస్ ప్రశ్నించాడు. ఈ సమాధానం విన్న ప్రేక్షకులు దటీజ్ ప్రభాస్ అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: