మెగాస్టార్ చిరంజీవి, యువరత్న బాలకృష్ణ సినిమాలు అప్పట్లో రిలీజ్ అవుతున్నాయంటే, ఆయా హీరోల అభిమానులు, మా హీరో సినిమా బాగా ఆడుతుంది అంటే బాగా ఆడుతుంది అంటూ పోటీపడే వారు. అయితే అప్పటినుండి కొనసాగుతున్న ఆ ఇద్దరు హీరోల సినిమాల మధ్య వార్, ఇటీవల మరింత పెరిగి, వారి వారి అభిమానులు ఏకంగా సోషల్ మీడియా మాధ్యమాల్లో ఒకరిపై మరొకరు పోటాపోటీగా విమర్శలు, 

ప్రతివిమర్శలు చేసుకునే స్థాయికి వచ్చింది. అతి త్వరలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న సైరా నరసింహారెడ్డి సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండడంతో, గతంలో బాలకృష్ణ నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలో బాలయ్య చేసిన నటన వలె మెగాస్టార్ సైరాలో నటించగలరా అంటూ నందమూరి ఫ్యాన్స్ ఇప్పటికే మెగా ఫ్యాన్ పై సోషల్ మీడియా వేదికల్లో ఛాలెంజ్ బాణాలు సంధిస్తున్నారు. ప్రస్తుతం ఆ కోల్డ్ వార్ సోషల్ మీడియాలో వాడి వేడిగా జరుగుతోంది. ఆ విషయం అటుంచితే, మరికొద్దిరోజుల్లో మరొక సారి మెగా, నందమూరి వార్ షురూ కాబోతోందని సమాచారం. 

కళ్యాణ్ రామ్ హీరోగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ప్రస్తుతం రూపొందుతున్న ఎంతమంచి వాడవురా సినిమాను డిసెంబర్ నెలాఖరులో రిలీజ్ చేయాలని గట్టిగా ప్లాన్ చేస్తోందట ఆ సినిమా యూనిట్. ఇకపోతే నిన్న సాయిధరమ్ తేజ్ హీరోగా యువి క్రియేషన్స్, జిఏ 2 పిక్చర్స్ పతాకంపై రూపొందుతున్న ప్రతిరోజు పండగే సినిమాను క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేస్తున్నట్లు ఆ సినిమా యూనిట్ ఒక ప్రకటన రిలీజ్ చేసింది. దీనితో ఆ ఇద్దరు హీరోల సినిమాల మధ్య పోటీ తప్పేలా కనపడడం లేదని టాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే నిజంగానే ఆ రెండు సినిమాల మధ్య పోటీ ఉంటుందా, లేక ఆ సమయానికి ఏదైనా సినిమా పోటీ నుండి తప్పుకుంటుందా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్దిరోజులు ఓపిక పట్టాల్సిందే....!!


మరింత సమాచారం తెలుసుకోండి: